Big Breaking News: రాష్ట్ర ప్రభుత్వానికి.. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ కి ఏపీ హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది.. పరిషత్ ఎన్నికల విషయంలో ఎవ్వరూ ఊహించని తీర్పు ఇచ్చింది.. రెండేళ్ల జగన్ ప్రభుత్వ కాలంలో ఇదే ఒక పెద్ద ట్విస్టుగా చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో మార్చి నెలలో జరిగిన మండల పరిషత్ / జిల్లా పరిషత్ ఎన్నికలు చెల్లవని.. మళ్ళీ నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది. సుప్రీమ్ కోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ఎన్నికల కమీషన్ ఈ ఎన్నికలను నిర్వహించింది అనీ.., పోలింగ్ కి కనీసం నాలుగు వారాల ముందు నోటిఫికెషన్ ఇచ్చి, నాలుగు వారాల పాటూ కోడ్ అమలు నిబంధన పాటించలేదని హైకోర్టు న్యాయమూర్తులు పేర్కొన్నారు. దీంతో ఏపీ ప్రభుత్వం పెద్ద చిక్కుల్లో పడింది.
Big Breaking News: ఏం చేయాలి..!?
ఇప్పటికే సీఎం జగన్ ఈ నిర్ణయంపై ఎలా ముందుకెళ్లాలి అనే విషయమై చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. సుప్రీమ్ కి వెళ్ళాలా..!? హైకోర్టులోనే రివ్యూ పిటిషన్ వేయాలా అనే అంశంపై చర్చిస్తున్నారు. సుప్రీం కి వెళ్లినా అక్కడ మార్గదర్శకాలు పాటించలేదు కాబట్టి ఇదే తరహా తీర్పు వచ్చే అవకాశం ఉందని న్యాయనిపుణులు భావిస్తుండడంతో ప్రభుత్వ స్పందనపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది..! ఎన్నికల కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నీలం సాహ్ని తీసుకున్న మొదటి నిర్ణయం స్థానిక ఎన్నికల నోటిఫికెషన్ ఇవ్వడమే. ఆమె గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న సమయంలో కూడా అనేక తీర్పులు ఆమె నిర్ణయాలకు వ్యతిరేకంగా వచ్చాయి. ఇప్పుడు ఈ నిర్ణయంతో ఆమె వ్యవహారశైలిపై, నిర్ణయాలపై తటస్థ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి.