Big Breaking: పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి నవజ్యోత్ సింగ్ సిద్దూ రాజీనామా చేశారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కొద్ది రోజుల్లో సిద్ధూ ఈ నిర్ణయం తీసుకోవడం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది, తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సిద్ధూ పంపారు. పంజాబ్ భవిష్యత్తు, సంక్షేమ అజెండా విషయంలో రాజీ పడటం ఇష్టంలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజీనామా లేఖలో సిద్దూ పేర్కొన్నారు. పీసీసీ పదవికి రాజీనామా చేసినా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని పేర్కొన్నారు. సోనియాకు పంపిన రాజీనామా లేఖను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు సిద్ధూ.
పంజాబ్ ఎన్నికలకు ముందు పీసీసీ పదవికి సిద్ధూ రాజీనామా చేయడం కాంగ్రెస్ నాయకత్వాన్ని దిగ్భాంతికి గురి చేసింది. ఇటీవల ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చరణ్ జిత్ సింగ్ చన్నీ నవజ్యోత్ సిద్ధూకు అత్యంత సన్నిహితుడు. ఈ నేపథ్యంలో సిద్ధూ సూపర్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నట్లు విస్తృతంగా విమర్శలు వచ్చాయి. అయితే అత్యున్నత నియామకాల్లో సీఎం చన్నీ సిద్ధూ సంప్రదించలేదనీ వార్తలు వస్తున్నాయి.
— Navjot Singh Sidhu (@sherryontopp) September 28, 2021