Tamil Nadu Theatres: రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా వారం రోజుల్లో తెరకెక్కనుంది. ఈ క్రమంలోనే తాజాగా రాజమౌళికి తమిళనాడు ప్రభుత్వం బ్యాడ్న్యూస్ చెప్పింది. పాన్ ఇండియా మూవీగా తీసుకొస్తున్న ఆర్ఆర్ఆర్ కు తమిళనాడు నుంచి భారీ రెస్పాన్స్ వస్తుందని రాజమౌళి భావించారు. ఇటీవల రాజమౌళి బృందం తమిళనాడు వెళ్లి భారీ ఎత్తున ప్రమోషన్లు కూడా చేసుకున్నారు. అన్నీ సవ్యంగానే జరుగుతున్నాయని అనుకుంటున్న నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వం థియేటర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనలు రేపటి నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే థియేటర్లు ప్రేక్షకులకు అందుబాటులో ఉంటాయని తమిళనాడు ప్రభుత్వం తాజాగా ప్రకటించడం రాజమౌళికి పెద్ద దెబ్బే అని చెప్పుకోవచ్చు.
తమిళనాడులో వేగంగా విస్తరిస్తున్న కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం వివిధ ఆంక్షలు విధిస్తోంది. కంటోన్మెంట్ జోన్లను ఏర్పాటు చేయడం నుంచి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా బ్యాన్ చేసింది. ఒమిక్రాన్ పరిస్థితుల రీత్యా ఇప్పుడు 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరవాలని ఆదేశించింది. దీంతో జనవరిలో ప్లాన్ చేసుకున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాల కలక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉంది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!