Big Breaking: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతుంది. సుప్రీమ్ కోర్టు ఈ కేసులో మూలాల్లోకి వెళ్తుంది. ఎవ్వరినీ వదిలి పెట్టడం లేదు. తమ దృష్టికి వస్తున్న పిటిషన్లు పరిశీలిస్తూ అవసరం మేరకు నోటీసులు జరీ చేస్తుంది. తాజాగా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి, సీబీఐకి నోటీసులు జరీ చేసింది. “సీఐడీ కస్టడీలో తన తండ్రిని ఏపీ సీఐడీ పోలీసులు కొట్టారని, హింసించారని.. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని” కోరుతూ ఎంపీ రఘురామకృష్ణంరాజు కుమారుడు భరత్ వేసిన పిటిషన్ పై ఈరోజు విచారణ చేపట్టిన సుప్రీమ్ ఈ మేరకు ఇలా పలువురికి నోటీసులు ఇచ్చింది. ఆరువారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
Big Breaking: నోటీసుల్లోనూ కొన్ని ట్విస్టులు..!
నిజానికి ఇది ఏపీ ప్రభుత్వానికి, ఏపీ పోలీసులకు సంబంధించిన వ్యవహారం. కానీ దీనిలో ఏపీ పోలీసుల కంటే ఏపీ సీఐడీ పాత్రా ఎక్కువగా ఉందని.. వారి కంటే కేంద్రం పరిధిలో అంశం ఉన్నందున వారిని ప్రతివాదులుగా చేర్చాలని రఘురామకృష్ణం రాజు తరపు లాయర్ ముకుల్ రోహత్గీ చేసిన వాదనని సుప్రీమ్ సమర్ధించింది. సీఐడీ, ఏపీ పోలీసులు ప్రతివాదులుగా ఉండాలి కానీ.. సీబీఐకి ఏం సంబంధం అంటూ ఏపీ ప్రభుత్వం తరపు లాయర్ దవే వాదించారు.. కానీ ఈ కేసు విచారణ చేయాల్సింది సీబీఐ.. ఈ కేసుకి ఆ విచారణ అర్హత ఉందొ, లేదో తేల్చాల్సింది సీబీఐ అని ముకుల్ విధించడంతో సుప్రీం ధర్మాసనం మొగ్గు చూపింది. ఏపీ ప్రభుత్వాన్నీ, ఏపీ పోలీసులను కాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని, సీబీఐ ని ప్రతివాదులుగా చేర్చి నోటీసులు జారీ చేసింది..!