జాతీయ రాజకీయాల్లో ఏపీ సీఎం జగన్ మార్కు కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి లోపాయికారీగా మద్దతు ఇస్తూ జగన్ జాతీయ రాజకీయాలను మలుపులు తిప్పుతున్నారని వారు విశ్లేషిస్తున్నారు.
జాతీయ రాజకీయాల్లో తనకు ఎవరైనా ఒకటేనని,అది యూపీఏ అయినా ఎన్డిఎ అయినా తనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని జగన్ ఇప్పటికే చాలాసార్లు స్పష్టం చేశారు. రాష్ట్రం కోసం తాను ఢిల్లీలో ఎవరు అధికారంలో ఉన్నవారికే మద్దతు ఇస్తానని కూడా చెబుతున్నారు. ప్రస్తుతం కేంద్రంలో మోడీ సారధ్యంలోని లోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఆయన తనవంతు సహకారం అందిస్తున్నారు. అదే సమయంలో ప్రధాని నరేంద్రమోడీ కూడా జగన్ వైఖరి పట్ల హ్యాపీగా ఉన్నారని సమాచారం.ఎందుకంటే వైసీపీ సంఖ్యాపరంగా పార్లమెంటులో నాలుగవ అతి పెద్ద పార్టీగా ఉంది.
జగన్ కూడా కొండంత అండగా మోడీ సర్కార్ కి ఉన్నారు. దాంతో జగన్ దన్ను చూసుకుని ప్రధాని ధీమాగా ఉన్నారని అంటున్నారు. నాలుగు దశాబ్దాల బంధంగా ఉన్న శిరోమణీ అకాలీదళ్ ఎన్డీయే నుంచి వేరు పడినా కూడా ఆయన లెక్కచేయలేదు అంటే అది జగన్ని చూసుకునే అంటున్నారు. ఎన్డీయేలో ఎన్ని పార్టీలు ఉన్నా కూడా అందరి కంటే జగన్ కే మోడీ ఎక్కువ విలువ ఇవ్వడానికి ఆయన మీద నమ్మకమే కారణం అంటున్నారు. అంతర్రాష్ట్ర సలహా మండలిలో దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒక్క జగన్ కే సభ్యత్వం ఇవ్వడం ద్వారా కేంద్రం ఆయనకు ఇస్తున్న ప్రాధ్యాన్యతను మోడీ తెలియచేశారు. మొత్తానికి మోడీకి మద్దతు ఇవ్వడం ద్వారా జగన్ జాతీయ రాజకీయాలను కీలకమైన మలుపు తిప్పేస్తున్నారు అంటున్నారు.
అదే సమయంలో జగన్ రాష్ట్ర ప్రయోజనాలను కూడా కాపాడుతున్నారని పరిశీలకులు చెబుతున్నారు.కేంద్రంతో గొడవ పెట్టుకోవడం వల్ల ఏ ప్రయోజనమూ లేకపోగా నష్టం కూడా ఉంటుందని గ్రహించిన జగన్ అందుకు భిన్నంగా మంచిగానే ప్రధానితో మెలుగుతూ రాష్ట్రానికి రావాల్సినవి రాబట్టుకునే పనిలో ఉన్నారట.జగన్ ఫస్ట్ టైమ్ సీఎమ్మే అయినప్పటికీ ఆయన ఆలోచనలు అనుభవజ్ఞులను మించేవి గా ఉన్నాయని పరిశీలకులు ప్రశంసిస్తున్నారు.అదే సమయంలో ప్రత్యేక హోదా విషయంలో జగన్ రాజీ పడకుండా మళ్లీ పావులు కదిపితే ఇంకా రాజకీయ మైలేజీ రాగలదని టిడిపికి విమర్శించడానికి పాయింటే ఉండదని వారు సలహా ఇస్తున్నారు