NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్‌కు ఢిల్లీ గుడ్ న్యూస్‌… మోదీజి మంచి మాట చెప్పారుగా

గ‌త కొద్దిరోజులుగా ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఊప‌రి స‌ల‌ప‌నివ్వ‌కుండా మారిపోయిన ఉదంతంలో ఉప‌శ‌మ‌నం దొరికింది. ఏపీకి వ‌ర‌ప్ర‌దాయిని అనే పేరున్న పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో కేంద్రం కీలక నిర్ణ‌యం తీసుకుంది.

 

పోలవరం బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు కేంద్ర ఆర్థికశాఖ నుంచి స్పందన వ‌చ్చింది. పోలవరం బకాయిల విడుదలకు మార్గం సుగమమం అయింది.

పోల‌వ‌రంపై పెద్ద రిలీఫ్‌

పోల‌వ‌రంపై గ‌త కొద్దికాలంగా నెల‌కొన్న ఉత్కంఠ‌కు తాజాగా రిలీఫ్ దొరికింది. ఎలాంటి షరతులు లేకుండా పోలవరం ప్రాజెక్టు బకాయిల విడుదల చేయ‌నున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ ప్ర‌క‌టించింది. కేంద్ర జలశక్తి శాఖకు ఈ మేర‌కు కేంద్ర ఆర్థికశాఖ మెమో పంపించింది. రూ. 2234.288 కోట్ల బకాయిలను చెల్లించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదన్న ఆర్థిక శాఖ ఈ మేర‌కు క్లారిటీ ఇచ్చింది. వీలైనంత త్వరగా దీనికి సంబంధించిన ప్రక్రియను పీపీఏ పూర్తిచేయాలంటూ కేంద్ర జలశక్తి శాఖకు కేంద్ర ఆర్థికశాఖ మెమో ద్వారా స‌మాచారం అందించింది. దీంతో పోల‌వ‌రం ప్రాజెక్టుకు సంబంధించిన నిధుల స‌మ‌స్య‌లో పెద్ద రిలీఫ్ వ‌చ్చిన‌ట్ల‌యింది.

ఇంకో కీల‌క స‌మావేశం

ఇదిలాఉండ‌గా, హైదరాబాద్‌లో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సమావేశం నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం సందర్భంగా…. వివిధ రాజకీయ పార్టీలు, రైతు సంఘాల ప్రతినిధులు అథారిటీ ఛైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌తో సమావేశమయ్యారు. సమావేశంలో అథారిటీ సభ్యులు హాజరై ప్రాజెక్టు పూర్తి అయ్యేందుకు త‌మ‌ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి… నిధుల మొత్తాన్ని కేంద్రమే భరించాలని అన్నారు. విభజన చట్టం ప్రకారం పోలవరం నిర్మాణం చేపడతామని కేంద్రం తెలిపిందని చెప్పారు. 2013-14 అంచనాల ప్రకారం నిధులు ఇస్తామని చెప్పడంతో ఏపీ ప్రజలపై పిడుగు పడినట్లయిందని అన్నారు. పూర్తి నిధులు ఇవ్వకపోతే 13 జిల్లాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతాయని హెచ్చరించారు.

కేంద్రానికి కొత్త ప్ర‌తిపాద‌న‌లు

పోలవరం ప్రాజెక్టు పరిధిలో బ్యాక్‌ వాటర్‌ ప్రభావంపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ మేరకు తెలంగాణ ఇరిగేషన్‌ ఈఎన్‌సీ మురళీధర్‌రావు పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులకు లేఖ రాశారు. 2009లో కృష్ణా నదికి వచ్చిన వరదతో అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని గోదావరిపై నిర్మిస్తున్న పోలవరం విషయంలోనూ… తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. స‌మావేశం అనంత‌రం ఏపీ ఈఎన్‌సీ నారాయణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, పోలవరంలో సవరించిన అంచనా వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరినట్టు తెలిపారు. ఇందుకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సానుకూలంగా స్పందించిందని అన్నారు. తమ ప్రతిపాదనను కేంద్ర జలశక్తిశాఖకు విన్నవిస్తామని చెప్పినట్టు వెల్లడించారు. ముంపుపై తెలంగాణ అభ్యంతరాలు పెద్ద ఇష్యూ కాదని ఏపీ ఈఎన్‌సీ నారాయణరెడ్డి అన్నారు. ప్రాజెక్ట్‌ను నింపినప్పుడు సమస్య వస్తే అప్పుడే పరిష్కరించుకుంటామని పేర్కొన్నారు.

author avatar
sridhar

Related posts

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Inter Board: ఏపీ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన .. రీ వెరిఫికేషన్, బెటర్మెంట్ ఫీజు చెల్లింపునకు పూర్తి సమాచారం ఇది

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju