వరస ఫ్లాపుల తర్వాత ఎనర్జిటిక్ హీరో రామ్ పూరి జగనాధ్ తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్’ తో బ్లాక్ బస్టర్ అందుకొని ఫుల్ ఫాం లో కి వచ్చేశాడు. ఈ సినిమా తర్వాత సోషల్ మీడియాలో రామ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. రామ్ చాలా కూల్ అండ్ కాం గోయింగ్. ఫంక్షన్స్ లో కనపడటానికి ఆసక్తి చూపించడు. హిట్ వచ్చినా ఫ్లాపొచ్చినా ఒకేలా ఉంటాడు.
అలాంటిది రీసెంట్ గా విజయవాడలోని కోవిడ్ హాస్పిటల్ లో జరిగిన ఘటనపై రామ్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. అయితే ఇది పెద్ద సంచలనం అయింది. ఆ హాస్పిటల్ రామ్ బంధువు రమేష్ ది కావడం.. రామ్ చెప్పింది ఏపీ సీఎం వైఎస్ జగన్ కి సెటైరికల్ సలహాలా ఉండడంతో సోషల్ మీడియాలో రామ్ మీద తీవ్రంగా విమర్శలు వచ్చాయి. ఇందులోకి కులం అనే పదాన్ని కూడా తీసుకొచ్చి రామ్ ని బాగా ట్రోల్ చేశారు. తర్వాత ఏపీ పోలీస్ కమీషనర్ కూడా రామ్ కి చిన్న వార్నింగ్ లాగా ఇవ్వడం పెద్ద హాట్ టాపిక్ అయింది. దాంతో ఇక నేను ఈ విషయం గురించి ఏం మాట్లాడనంటూ రామ్ సైలెంట్ అయ్యాడు.
ఇలా ఆవేశంలో మొదలు పెట్టి తాకిడి తట్టుకోలేక ముగించేసా అని చెప్పినంత ఈజీ కాదు ..జనాల కామెంట్స్ ని ఆపడం. అందుకే ఈ సంఘటన రామ్ ని బాగా డిప్రెషన్ లోకి తీసుకెళ్ళిందని అంటున్నారు. అనవసరంగా కదిలించిన ఈ సంఘటన రామ్ కి సోషల్ మీడియాతో పాటు బయట జనాలలోను విపరీతంగా నెగటివిటీ తీసుకు వచ్చింది. దాంతో తను ఎవరినీ కలవడం లేదని సమాచారం. స్టోరీ డిస్కషన్స్ ని కూడా ప్రస్తుతానికి నిలిపివేశాడట.
ఎప్పుడూ తన పని తను చేసుకుంటూ ఉంటే రామ్ కి ఇలాంటి సంఘటన మొదటి సారి ఎదురవడంతో మానసికంగా కృంగిపోతున్నాడట. ఇక రామ్ నటించిన రెడ్ సినిమా రిలీజ్ కి సిద్దంగా ఉంది. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన తడం సినిమాకి అఫీషియల్ రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది.