రాజు తలచుకుంటే కొరడా దెబ్బలకు కొదవా..? అర్నాబ్ పిచ్చి కానీ.., శివసేన తలచుకుంటే తనను అరెస్టు చేయడం ఓ లెక్కా ఏమిటి..!? ప్రశ్నిస్తే తట్టుకునే ప్రభుత్వాలు లేవిప్పుడు..! కేంద్రంలో బీజేపీని ప్రశ్నించాలనే ఆలోచన వస్తేనే చాలు, ఇరికించేస్తుంది. రాష్ట్రాల్లో శివసేన, వైసీపీ లాంటి ప్రభుత్వాలను ఎవరైనా ప్రశ్నిస్తే తట్టుకోలేరు.! అటువంటి దశలో అర్నాబ్ గోస్వామి అనే ఒక జర్నలిస్టు రోజూ గంటల తరబడి డిబేట్లు నిర్వహిస్తూ శివసేనని, సీఎంని, పోలీసులను టార్గెట్ చేస్తుంటే ఎందుకు ఊరుకుంటారు..? స్కెచ్ వేస్తారు. ఇరికిస్తారు. బొక్కలోకి నెడతారు. అదే జరిగింది. ఒక పక్కా ప్లాన్ ప్రకారం అర్నాబ్ గోస్వామిని పోలీసులు పట్టుకెళ్లారు. కనీసం మూడు నెలలు పక్కా..!!
రెండేళ్ల కిందట మూసేసిన కేసుని తిరగేశారు..!!
రిపబ్లికన్ టీవీ జర్నలిస్టు అర్నాబ్ ని అరెస్టు చేసింది అందరూ అనుకుంటున్నట్టు టీఆర్పీ స్కాం లోనో, అసెంబ్లీ జారీ చేసిన నోటీసులో కాదు..! ఒక పాత కేసుని తిరగేశారు. రెండేళ్ల కిందటే మూసేసిన “ఆత్మహత్య ప్రేరేపణ” కేసుని మళ్ళీ తెరిచి గోస్వామిని మూసేసారు. అన్వయ నాయక్ అనే వ్యాపారి రిపబ్లికన్ టీవీకి రూ. 83 లక్షలు బాకీ పడ్డారు. దీన్ని వసూలు చేసే క్రమంలో అర్నాబ్ సహా మరో ఇద్దరు నాయక్ కుటుంబాన్ని ఒత్తిడి చేసారు. దీంతో నాయక్ సహా అతని భార్య ఆత్మహత్య చేసుకున్నారు. అందుకే 2018 లోనే అర్నాబ్ సహా మరో ఇద్దరిపై ఆత్మహత్య ప్రేరేపణ కేసు నమోదయింది. దీన్ని అప్పటి లాబీయింగులు, సెటిల్మెం వ్యవహారాలతో పోలీసులే మూసేసారు. కానీ ఇప్పుడు మళ్ళీ తెరవాల్సిన అవసరం ఏర్పడింది.
పోలీసులు తలచుకుంటే కష్టమా..!?
అర్నాబ్ కొద్దీ రోజులుగా టీవీలో విపరీతంగా చర్చలు పెడుతున్నారు. సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని, ముంబై పోలీసులను ఇరికించేలా డిబేట్లు నిర్వహిస్తున్నారు. అఫ్ కోర్స్ అతని వెనుక స్క్రిప్ట్ మొత్తం బీజేపీ ఇచ్చి ఉండొచ్చు గాక. కానీ శివసేనకు బాగా కాలింది. అక్కడ మనలా ఉండదు. పోలీసులు టార్గెట్ చేస్తే పక్కా దొరకాల్సిందే. అందుకే అర్నాబ్ పై ఉన్న పాత కేసులను తిరగేశారు. ఆ “ఆత్మహత్య ప్రేరేపణ” కేసు దొరికింది. వెంటనే పోలీసులు అలెర్ట్ అయ్యారు. నాయక్ కుటుంబ సభ్యుల చేత మళ్ళీ పిర్యాదు తీసుకున్నారు. కేసుని 2018 లో ఎక్కడ ముగించారో.., ఇప్పుడు అక్కడే మొదలు పెట్టారు. రీ ఇన్వెస్టిగేట్ చేసి ప్రధాన నిందితుడిగా అర్నాబ్ ని అరెస్టు చేసారు. పక్కా లీగల్ గా, ఒక కీలక కేసులో ఇరికించేశారు. ఇక్కడ బీజేపీ, అమిత్ షా కూడా ప్రస్తుతానికి ఏమి చేయలేరు. సో.. ప్రస్తుతానికి అమిత్ షా, స్మృతి ఇరానీ, బీజేపీ పెద్దలు ఎవరైనా ఖండనలు.., పత్రికా ప్రకటనలు ఇవ్వడం తప్ప ఇంకేం చేయలేరు. ఇక మహారాష్ట్ర పోలీసులకు తదుపరి టార్గెట్ ఎవరనుకుంటున్నారా..? ఇంకెవరూ బీజేపీ అండ, అర్నాబ్ ఛానెల్ అరుపులు చూసుకుని రెచ్చిపోతున్న కంగనా రనౌత్. ఎస్… ఇక రేపో, మాపో కంగనా కూడా కటకటాల్లోకి వెళ్లాల్సిందే. అసలే అది శివసేన పోలీస్ బలగం..!!
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?