ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ పునఃనియామకం కోసం హైకోర్టు దిశానిర్దేశం తో ఆయన గవర్నర్ ను కలవనున్నారు. 20వ తేదీన రాజ్ భవన్ నిమ్మగడ్డకు అపాయింట్ మెంట్ ఇచ్చింది.
హైకోర్టు ఆదేశాలను అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నిమ్మగడ్డ గతంలోనే గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. అయితే అప్పుడు గవర్నర్ కార్యాలయం నుండి ఎలాంటి స్పందన రాలేదు. ఇప్పుడు నేరుగా హైకోర్టు ఆదేశించడంతో గవర్నర్ నుంది నిమ్మగడ్డకు అపాయింట్మెంట్ వచ్చింది. హైకోర్టు తీర్పును వివరించి తన బాధ్యతలు తీసుకోవాలని…. ఈ విషయంలో సహకరించాలని నిమ్మగడ్డ గవర్నర్ ను కోరనున్నాడు.
అయితే గతంలో రమేష్ కుమార్ విషయంలో ప్రభుత్వానికి గవర్నర్ అండగా నిలిచారు. మొదట నిమ్మగడ్డ నియామకం గవర్నర్ చేతుల మీదుగానే జరుగుతుంది. ఎస్ఈసి పదవి రాజ్యాంగబద్ధమైనది అని కూడా ఆయనకి తెలుసు. అసలు మ్యాటర్ ఏమిటంటే.. ప్రభుత్వాలు సిఫారసు చేసినా గవర్నర్ దానిని కచ్చితంగా దానిని ఆమోదించాలి అన్న నిబంధన అయితే ఏమీ లేదు. చంద్రబాబు హయాంలో ఇతర అధికారిని సిఫార్సు చేసినప్పటికీ అప్పటి గవర్నర్ నరసింహన్ తన వద్ద చాలా కాలం పని చేసిన నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల కమిషనర్ గా నియమించారు.
అయితే కొద్ది రోజుల కిందట మాత్రం నిమ్మగడ్డను తొలగించబడిన ఉత్తర్వుల మీద సంతకం చేసిన విశ్వభూషణ్ హరి చందన్… కనగరాజ్ ను కొత్త ఎస్ఈసీగా నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు పైనా సంతకం పెట్టారు. కాబట్టి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న గవర్నర్ వద్దకే ఇప్పుడు నిమ్మగడ్డ వెళ్ళిపోతున్నాడు అన్నమాట. ఇదిలా ఉండగా ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని సాదాసీదా రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారికి కూడా తెలుస్తుంది. కానీ గవర్నరు మాత్రం కనీసం న్యాయ సలహా తీసుకోకుండా గంటల వ్యవధిలోనే ఆమోదించి సంతకం పెట్టారనే విమర్శలు వస్తున్నాయి. ఇక ప్రభుత్వం పంపిన నిమిషాల్లోనే సంతకం చేసిన గవర్నర్ హైకోర్టు ఆదేశాలను పాటించి అంతే సమయంలో మళ్లీ తనకు ఉన్న పవర్ లో నిమ్మగడ్డ నిమాయకం జరుపుతారా లేదా అన్నది ఇక్కడ సందేహాస్పదం.
ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న బిశ్వభూషణ్ హరిచందన్.. ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్నదే ఇప్పుడు చర్చ. నిమ్మగడ్డ విజ్ఞాపన పత్రం తీసుకుని సైలెంట్గా ఉండిపోతారా.. లేక హైకోర్టు తీర్పును అమలు చేయమని.. ప్రభుత్వానికి సూచిస్తారా.. అన్నది ఆసక్తికరంగా మారుతోంది. అందుకే.. అందరి చూపూ రాజ్భవన్ వైపు మళ్లుతోంది.