NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Counterfeit Kallu: కల్తీ కల్లు కేసులో బిగ్ ట్విస్ట్ ఇదీ..అయిదుగురు మృతికి కారకుడైన నిందితుడు అరెస్టు..!!

Counterfeit Kallu: కొంత మంది చాలా తెలివిగా నేరం చేసి తప్పించుకోవాలని ప్రయత్నిస్తుంటారు. తాము చేసిన నేరం వెలుగు చూడదు. సేఫ్ గా ఉండవచ్చు అని అనుకుంటారు. కానీ పోలీసులు పకడ్బందీగా దర్యాప్తు చేస్తే నేరం చేసిన వాడు ఎలాగైనా దొరికి పోతాడు అని ఈ ఘటన రుజువు చేస్తోంది. తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం లోదొడ్డి గ్రామంలో ఇటీవల కల్తీకల్లు తాగడం వల్ల అయిగురు గిరిజనులు మృతి చెందిన సంఘటన తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసును అటు ఎక్సైజ్, ఇటు సివిల్ పోలీసులు చాలా తీవ్రంగా పరిగణించి దర్యాప్తు చేయగా ఓ కీలకమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి హత్య కోసం జరిగిన కుట్రకు అయిగురు బలి అయ్యారు అని దీనికి ఓ వ్యక్తి అక్రమ సంబంద వ్యవహారం కారణం అని తెలిసి పోలీసులు షాక్ అయ్యారు.

Big twist in the case of Counterfeit Kallu
Big twist in the case of Counterfeit Kallu

Counterfeit Kallu: జీలుగ కల్లు శాంపిల్స్  లో క్రిమి సంహారక మందు

కల్లు తాగి అయిదుగురు గిరిజనులు మృతి చెందడంతో తొలుత కల్తీ కల్లు అని అందరూ భావించారు. దీనిపై పోలీసులు, ఎక్సైజ్, వైద్య ఆరోగ్య శాఖలు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపాయి. అయిదుగురు మృతి చెందడానికి కారణమైన జీలుగ కల్లు శాంపిల్స్ ను పరీక్షల నిమిత్తం కాకినాడలోని ఎక్సైజ్ శాఖ ప్రాంతీయ పరీక్షా కేంద్రానికి పంపించారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో కల్లులో క్రిమి సంహారక మందు కలిసినట్లు నిపుణులు గుర్తించారు. దీంతో ఆ శాంపిల్స్ ను ఫొరెన్సిక్ ల్యాబ్ కు కూడా పంపించారు. సాధారణంగా జీలుగ కల్లు తాగితే వ్యక్తులు చనిపోయే అవకాశం ఉండదు. దీని వెనుక ఎదో కుట్రకోణం ఉందని పోలీసులు అనుమానించారు. వారి అనుమానమే నిజం అయ్యింది. ఫొరెన్సిక్ రిపోర్టులోనూ క్రిమిసంహారక మందు కలిసినట్లు రిపోర్టు వచ్చింది.

 

ఒక వ్యక్తిని చంపేందుకు కుట్ర చేసి..

దీంతో ఈ కల్లులో క్రిమిసంహారక మందు కలపడానికి కారకులు ఎవరు ? ఎందుకు చేశారు ? అనే దానిపై పోలీసులు దర్యాప్తు జరిపారు. మృతుల వివరాలు మొత్తం తీసుకుని వారిలో ఎవరికైనా గొడవలు ఉన్నాయా ? వాళ్లను హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది ? తదితర విషయాలపై లోతైన దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మృతుల్లో ఒకరైన గంగరాజు భార్యతో రాంబాబు అనే వ్యక్తికి అక్రమ సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో రాంబాను పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయగా నిజాన్ని అంగీకరించాడు. గంగరాజును చంపేందుకు రాంబాబు జీలుగ కల్లులో గడ్డి మందు కలపాడనీ, అ విషయం తెలియక గంగరాజుతో కలిసి కల్లు తాగిన మిగిలిన నలుగురు కూడా ప్రాణాలు కోల్పోయారని దర్యాప్తులో తేలింది. అయిదుగురు మృతికి కారణమైన రాంబాబును పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju