ప్రభాస్ – నాగ్ అశ్విన్ సినిమా అనౌన్స్ మెంట్ టాలీవుడ్ లో పెద్ద హాట్ టాపిక్. కారణం ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబినేషన్ సినిమా ఉంటుందని ఏ ఒక్కరు ఊహించకపోవడమే. బాహుబలి సినిమా తో పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ కేవలం రెండే సినిమా లు చేసిన నాగ్ అశ్విన్ తో సినిమా ఎలా కమిటయ్యాడు అని అందరూ ఆసక్తికరంగా మాట్లాడుకున్నారు. అయితే మహానటి సినిమా గురించి ఆలోచించిన ప్రతీ ఒక్కరికి నాగ్ అశ్విన్ స్టామినా ఏంటో క్లారిటీ వచ్చేస్తుంది.
అంతేకాదు ఈ సినిమాని నిర్మించేది ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్. సి అశ్వనీదత్ సమర్పణలో స్వప్న దత్, ప్రియాంక దత్ సంయుక్తంగా దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా అనౌన్స్ అయి చాలా నెలలు కావస్తుంది. హీరోయిన్ గా దీపిక పదుకొణె, ముఖ్య పాత్రలో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారన్న న్యూస్ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. కాని ఈ సినిమా తర్వాత అనౌన్స్ అయిన ప్రాజెక్ట్స్ విషయంలో మాత్రం సర్ప్రైజింగ్ అప్డేట్స్ వచ్చాయి.
దాంతో ఈ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశం లేదని ఇండస్ట్రీ వర్గాలలో చర్చించుకున్నారు. ప్రస్తుతం రాధే శ్యాం కంప్లీట్ చేస్తున్న డార్లింగ్ ప్రభాస్ జనవరి నుంచి కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అన్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ని మొదలు పెట్టబోతున్నాడు. అంతేకాదు ప్రభాస్ బాలీవుడ్ లో స్ట్రైట్ గా చేస్తున్న సినిమా ఆదిపురుష్ కూడా గ్రీన్ మ్యాట్ మీద షూటింగ్ మొదలైందని అంటున్నారు. కాగా లేటెస్ట్ గా నాగ్ అశ్విన్ బిగ్ అప్డేట్ ఇచ్చి ఫ్యాన్స్ కి భారీ సర్ప్రైజ్ ఇచ్చాడు. ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాకి సంబంధిన పెద్ద సర్ప్రైజ్ న్యూ ఇయర్ లో ఇవ్వబోతున్నట్టు స్వయంగా నాగ్ అశ్విన్ వెల్లడించాడు. ఈ అప్డేట్ తో ప్రభాస్ ఫ్యాన్స్ న్యూ ఇయర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని డేట్స్ లెక్కపెట్టుకోవడం మొదలు పెట్టారట.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?