ప్రభాస్ రాధేశ్యామ్.. ఇప్పుడు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా. ప్రభాస్ తన కెరీర్ లో నటిస్తున్న 20 వ సినిమాగా రాధే శ్యామ్ రూపొందుతుండగా జిల్ ఫేం రాధకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ సీనియర్ నటి భాగ్య శ్రీ కీలక పాత్ర పోషిస్తుంది. కాగా ఈ సినిమాని యువి క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తుండగా ప్రభాస్ పెదనాన్న సొంత నిర్మాణ సంస్థ గోపీ కృష్ణ మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాతో ప్రభాస్ చెల్లి ప్రశీద నిర్మాణ రంగం లోకి అడుగుపెట్టింది.
ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ సినిమా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండటం మరో ఆసక్తికరమైన విషయం. చాలా ఏళ్ళ తర్వాత ప్రభాస్ మంచి రొమాంటిక్ లవ్ స్టోరీలో నటిస్తున్నాడు. ఇప్పటికే విక్రమాదిత్య గా ప్రభాస్, ప్రేరణ గా పూజా హెగ్డే లుక్స్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కాగా ఈ సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ అయిపోయిందని తెలుస్తోంది. ఇక పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కూడా ఒకవైపు నుంచి మొదలు పెట్టారట. అయితే ఇప్పుడు మేకర్స్ ఈ సినిమాని మే ఆఖరి వారం లేదా జూన్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
ఇక ప్రభాస్ త్వరలో కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. సలార్ అన్న టైటిల్ తో ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతోంది. జనవరి మూడవ వారం నుంచి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతుండగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆదిపురుష్ లో కూడా ఫిబ్రవరి ఆఖరున లేదా మార్చ్ నుంచి జాయిన్ కాబోతున్నాడట ప్రభాస్. మొత్తానికి రాధే శ్యామ్ జూన్ అంటే సలార్ కూడా ఆ తర్వాత మరో రెండు నెలల్లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.