బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన వారిలో చివరాఖరికి అవినాష్ మాత్రమే మిగిలి ఉండటం జరిగింది. ఇంటిలోకి ముగ్గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వగా ఇద్దరు ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఇంటి లో అడుగు పెట్టిన నాటి నుండి ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేస్తూ టాస్క్ ఆడే సమయంలో కూడా రచ్చ రచ్చ చేస్తున్నాడు అవినాష్.
ఇక వీకెండ్ ఎపిసోడ్ లలో అయితే నాగార్జున ముందు బాగా హైలెట్ అవ్వడానికి అవినాష్ భారీ స్థాయిలోనే కష్టపడుతున్నాడు. ఏది ఏమైనా హౌస్లో తాను మాత్రం ఎంటర్టైన్ చేస్తూనే మరోపక్క టైటిల్ గెలుచుకోవటానికి అనేక పాట్లు పడుతున్నాడు. ముఖ్యంగా ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ వచ్చేసరికి అవినాష్ బాగా భయపడుతున్నట్లు బయట టాక్. మేటర్ లోకి వెళ్తే ఎలిమినేషన్ ఎపిసోడ్ అనేసరికి బీద ఏడుపు ఏడుస్తు, నిరుద్యోగ స్టోరీలు చెబుతూ వచ్చాడు.
కాగా ప్రస్తుతం టాప్ ఫైవ్ లో కి వెళ్లే రీతిలో హౌస్ లో గేమ్ ఆడుతున్నాడు. ఇదిలా ఉండగా ఇంకా మూడు వారాల ఆట మిగిలి ఉన్న సమయంలో బిగ్ బాస్ హౌస్ లో డైరెక్టర్ టికెట్టు ఫినాలే టాస్క్ బిగ్ బాస్ ఇవ్వటం జరిగింది. ఈ టాస్క్ లో ఎవరైతే మెడల్ గెలుస్తారో వాళ్లు బిగ్ బాస్ ఫైనల్ విక్ కి చేరుకుంటారని బంపర్ ఆఫర్ ఇంటి సభ్యులకు ఇచ్చారు. అయితే ఈ టాస్క్ లో ఆవు దగ్గర పాలు తీసుకునే విధానంలో అవినాష్ దొంగాట ఆడినట్లు బిగ్ బాస్ తేల్చారు. మేటర్ లోకి వెళ్తే ఈ టాస్క్ లోపాలు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్ళు విజేత అని తెలపడంతో.. అవినాష్ పాలల్లో నీళ్ళు కలపటం మాత్రమేకాక రేషన్ లో ఉన్న పాల ప్యాకెట్ పాలు కూడా కలిపేయడం జరిగిందట. దీంతో ఈ టాస్క్ లో దొంగ గేమ్ ఆడటం తో అవినాష్ కలెక్ట్ చేసిన పాలను బిగ్ బాస్ లెక్కలోకి తీసుకోలేదని అంటున్నారు. దీంతో టికెట్టు ఫినాలే టాస్క్ లో అవినాష్ ఆడిన తొండి ఆట వల్ల.. ఫైనల్ వీక్ చేరుకోవడానికి అవకాశం కోల్పోయినట్లు టాక్ .