దీపావళి సందర్భంగా బిగ్ బాస్ షో నిర్వాహకులు జరగబోయే ఎపిసోడ్ గ్రాండ్ గా సక్సెస్ అవ్వాలని, ఆడియన్స్ కి గుర్తు ఉండిపోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో దసరా ఎపిసోడ్ లో సమంత ని స్టేజిపైకి ఎక్కించిన షో నిర్వాహకులు, ఆ ఎపిసోడ్ కి అదిరిపోయే రేంజ్ లో ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాండ్ దక్కించుకున్నారు.
ఇప్పుడు ఇదే మాదిరిగా దీపావళికి ఎపిసోడ్ కూడా ప్రేక్షకులకు గుర్తుండి పోవాలి అని వేదికపైకి స్టార్ హీరో నాగచైతన్య ని తీసుకు రావడానికి రెడీ అయినట్లు టాక్. అంతే కాకుండా చైతు తో పాటు శేఖర్ కమ్ముల, “లవ్ స్టోరీ” సినిమా యూనిట్ బిగ్ బాస్ వేదికపై సందడి చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గతంలో అయితే హౌస్ లోకి వెళ్లి సెలబ్రిటీలు వాళ్లతో ముచ్చటించే వాళ్ళు.
అయితే ప్రస్తుతం కరోనా కారణంగా స్టేజి పైనే నాగచైతన్య నటిస్తున్న కొత్త సినిమా “లవ్ స్టోరీ” సినిమా యూనిట్ కీలక సభ్యులు ఇంటిలో ఉన్న సభ్యులతో ముచ్చటించన్నునట్లు సమాచారం. కరోనా కారణంగా థియేటర్లు క్లోజ్ అవ్వటంతో ప్రమోషన్ కార్యక్రమాలు ఈసారి సీజన్ లో పెద్దగా జరగలేదు. అయితే ఇటీవల మళ్లీ థియేటర్ లు ఓపెన్ అయ్యే పరిస్థితి నెలకొనటంతో పాటు సినిమా షూటింగులు స్టార్ట్ కావటంతో హౌస్ లో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలవుతున్నాయి. షో పై మరింత ఇంట్రెస్ట్ కలిగించే విధంగా బిగ్ బాస్ నిర్వాహకులు ఈవారం నాగచైతన్య మాత్రమే కాక మరొక కుర్ర హీరో ని కూడా షోకి తీసుకురాబోతున్నాట్లు వార్తలు వస్తున్నాయి.