బిగ్ బాస్ సీజన్ ఫోర్ ఇంకా మూడు రోజుల ఆట మాత్రమే మిగిలి ఉంది. దీంతో హౌస్ లో ఉన్న సభ్యులు ఎవరికి వారు వీర లెవల్ లో బిగ్ బాస్ ఇస్తున్న ప్రతి టాస్క్ కోసం ఫుల్ ఎనర్జీ, ఫోకస్ పెడుతూ ఆడుతున్నారు. మరోపక్క కంటెస్టెంట్ లా సపోర్టర్ లు ఇక కొద్దిగానే టైం ఉండటం తో భారీ స్థాయిలో ప్రచారం చేస్తున్నారు.
ఓటింగ్ చూస్తుంటే లెక్కలు ఉన్న కొద్దీ మారిపోతున్నాయి. ఊహించని కంటెస్టెంట్ లు దూసుకుపోతున్నారు. వినపడుతున్న వార్త ప్రకారం ఈసారి కచ్చితంగా ఫిమేల్ క్యాండెట్ విజయం సాధించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కోసం ఈసారి చీఫ్ గెస్ట్ గా ఎవరు వస్తారు అనేదాన్ని విషయంలో సోషల్ మీడియాలో మరియు బయట రకరకాల పేర్లు వినపడుతున్నాయి.
ఎన్టీఆర్ కానీ లేదా సూపర్ స్టార్ మహేష్ గాని, వచ్చే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత చిరంజీవి వెంకటేష్ పేర్లు కూడా వినిపించాయి. ఇటువంటి తరుణంలో తాజాగా షో నిర్వాహకులు ఫినాలే గెస్ట్ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మేటర్ లోకి వెళ్తే సీజన్ త్రీ ఫినాలే కి చీఫ్ గెస్ట్ గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి మరోసారి టైటిల్ అందించడానికి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే కనుక ఈ సారి కూడా టిఆర్పి రేటింగ్ లు రికార్డు స్థాయిలో నమోదవడం గ్యారెంటీ అని బిగ్ బాస్ ఆడియన్స్ పేర్కొంటున్నారు.