బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో ప్రేక్షకుల ఓటింగ్ ను పరిగణలోకి తీసుకోకుండా ఇష్టానుసారంగా ఎలిమినేషన్ జరుగుతున్నట్లు బయట టాక్ విపరీతంగా ఉంది. టీవీ9 యాంకర్ దేవి నాగవల్లి, కుమార్ సాయి ఎలిమినేషన్ విషయంలో ఆడియన్స్ ఓటింగ్ పరంగా కాకుండా స్క్రిప్టు పరంగా ఎలిమినేషన్ జరిగినట్లు అప్పట్లోనే వార్తలు రావటం మనకందరికీ తెలిసిందే.
తాజాగా ఈ వీకెండ్ లో ఇన్ని రోజులు అరుపులు వాదనలు తో సాగిన షో వీకెండ్ కావటంతో ఇంటి నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న దాని విషయంలో ఆడియెన్స్ లో ఉత్కంఠత నెలకొంది. కాగా ఈవారం ఎలిమినేషన్ కి అభిజిత్, హారిక, రాజశేఖర్, మోనాల్ నామినేట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఇంటి నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న దాని విషయంలో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా ఈ ఐదు మంది లో మోనాల్ కంటే అమ్మ రాజశేఖర్ కి తక్కువ ఓట్లు వచ్చినట్లు సోషల్ మీడియాలో టాక్ వస్తోంది. దీంతో అమ్మ రాజశేఖర్ ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యే చాన్స్ ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ కొన్ని వారాలుగా హౌస్ నుండి ఎక్స్పెక్ట్ చేయనివారు ఇంటి నుండి ఎలిమినేట్ అవుతున్నారు. దీంతో ప్రస్తుతం మాస్టర్ కెప్టెన్ అవటంతో మాస్టర్ ఎలిమినేషన్ అవుతారా లేదా అన్నది సస్పెన్స్ గా ఉంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?