బిగ్ బాస్ హంగామా ఎట్టకేలకు మొదలైంది. బిగ్ బాస్ సీజన్ 4 నిన్న అట్టహాసంగా ప్రారంభమైంది. నాగార్జున ఈ సీజన్ ను కూడా హోస్ట్ చేస్తున్నాడు. మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ తో 15 వారాల ఎంటర్టైన్మెంట్ కు బిగ్ బాస్ సిద్ధమైంది. ఈ 15 మందిలో టివి9 ప్రముఖ యాంకర్ దేవి కూడా ఉన్నారు.
టివి9 దేవిగా అందరికీ సుపరిచితమైన దేవి అసలు పేరు దేవి నాగవల్లి. ఆమె బిగ్ బాస్ లో ఎంట్రీ సందర్భంగా తన గురించి ఎవరికీ తెలియని విషయాలను తెలియజేసింది. తాను రాజమండ్రి నుండి వచ్చానని, బి.కామ్ వరకూ చదువుకున్నానని తెలియజేసింది దేవి. అలాగే తాను ఎన్నో క్రైమ్ రిపోర్టింగ్ లు చేసానని, ఎంతో కాలం జర్నలిస్ట్ గా చేసినా కూడా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతున్న సందర్భంగా తనలో ఏదో తెలియని భయం వెంటాడుతోందని తెలిపింది.
అలాగే తాను డబ్బు కోసమే బిగ్ బాస్ హౌస్ కు వచ్చానని కుండబద్దలు కొట్టింది. తాను ఎన్నో న్యాచురల్ డిజాస్టర్లను, ఎన్నో దారుణమైన క్రైమ్స్ ను, బాంబ్ బ్లాస్టులను, ఎన్నో మరణాలను దగ్గరనుండి చూశానని తెలిపింది. ఇక తన వ్యక్తిగత జీవితం గురించి కూడా సంచలన విషయాలను బయటపెట్టింది. తమది పెద్దలు కుదిర్చిన పెళ్లి అని, అయినా తామిప్పుడు కలిసి ఉండట్లేదని, విడాకులు తీసుకుని ఎవరి దారి వాళ్ళు చూసుకున్నామని తెలిపింది.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ బిగ్ బాస్ స్క్రిప్ట్ ప్రకారం నడుచుకుంటుంది అని చాలా మంది రిపోర్టర్స్ కు సందేహాలు ఉన్నాయి కదా అని ప్రశ్నించగా తాను కూడా ఎన్నో ఇంటర్వ్యూలు చేసానని అవి కూడా స్క్రిప్ట్ అనుకోవచ్చు కదా అని సమాధానం ఇచ్చింది. మరి చూద్దాం బయట ఫైర్ బ్రాండ్ లాంటి ఇమేజ్ ఉన్న దేవి నాగవల్లి, బిగ్ బాస్ హౌస్ లో ఏం చేస్తుందో.