బిగ్ బాస్ సీజన్ ఫోర్ దాదాపు చివరి దశకు వచ్చేసింది. 12 వారాలు దిగ్విజయంగా పూర్తిచేసుకుని 13వ వారంలో ప్రస్తుతం గేమ్ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా 19 మంది బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్ కాగా చివరాకరికి వచ్చేసరికి ప్రస్తుతం ఏడుగురు మాత్రమే మిగిలి ఉన్నారు. ఇదిలా ఉండగా చాలావరకు హౌస్ లో బిగ్ బాస్ ఆడిస్తున్న టాస్క్ లు పట్ల బయట జనాలు నుండి భారీ స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
సీజన్లు మారుతున్నా గాని అవే టాస్క్ లు ఆడించడం వల్ల ఏమి ఉపయోగం అని మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా గత సీజన్ త్రీ లో బిగ్ బాస్ ఫినాలే 2 టాస్క్ లో రాహుల్ సిప్లిగంజ్ టికెట్ గెలవడం జరిగింది. దీంతో డైరెక్టుగా ఫినాలే చేరిపోయాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం హౌస్ లో జరుగుతున్న ఇదే టాస్క్ లో అఖిల్ గెలిచినట్లు సోషల్ మీడియాలో వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఫస్ట్ నుండి అఖిల్ కి మంచి ఓటింగ్ ఉండటంతోపాటు ఫిజికల్ టాస్క్ లో అదేవిధంగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ఉండటం జరిగింది.
రాహుల్ సిప్లిగంజ్ మాదిరిగానే దాదాపు అఖిల్ కూడా ఈ సీజన్లో రాణించడం జరిగింది. దీంతో సెంటిమెంట్ పరంగా చూసుకుంటే సీజన్ త్రీ లో టికెట్టు ఫినాలే కొట్టిన రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ గెలవడం జరిగింది. ఇప్పుడు ఆ సెంటిమెంటు పరంగా చూసుకుంటే సీజన్ ఫోర్ విన్నర్ అఖిల్ యే అని డిస్కషన్లు సోషల్ మీడియాలో గట్టిగా జరుగుతున్నాయి.