దాదాపు వంద రోజులకు పైగానే టెలివిజన్ ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది బిగ్ బాస్ సీజన్ ఫోర్ రియాల్టీ షో. లాక్ డౌన్ ఎఫెక్ట్ కి సినిమా థియేటర్లు క్లోజ్ అవటంతో ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులు బిగ్ బాస్ షో తో బాగా ఎంటర్టైన్ అయ్యారు. ఒకపక్క ఐపీఎల్ మ్యాచ్ లు జరిగినా గాని షో కి ఏమాత్రం టిఆర్పి రేటింగులు తగ్గకుండా హౌస్ లో సరికొత్త టాస్క్ లు పెడుతూ షో పై ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ ఉండేలా జాగ్రత్త పడ్డారు.
ప్రస్తుతం చివరి వారం కొనసాగుతున్న తరుణంలో హౌస్ లో బిగ్ బాస్ సందడి వాతావరణం ఉండేలా మంగళవారం జరిగిన ఎపిసోడ్ లో మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ లను అదేవిధంగా రన్నరప్ లను తీసుకొచ్చి హౌస్ లో ఉన్న సభ్యులతో ముచ్చటించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇదిలా ఉండగా బుధవారం జరగబోయే ఎపిసోడ్ లో వందరోజుల బిగ్ బాస్ జర్నీ ఏవి ని అనగా స్పెషల్ వీడియో ని ప్రసారం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇక శుక్రవారం జరగబోయే ఎపిసోడ్ లో ఈ సీజన్ లో ఎంటరైన బిగ్ బాస్ కంటెస్టెంట్ లందరూ తిరిగి హౌస్ లోకి వచ్చి బిగ్ బాస్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్ లకి “ఆల్ ది బెస్ట్” చెప్పబోతున్నట్లు టాక్ వినబడుతోంది. అయితే ఈసారి టైటిల్ విన్నర్ కంటెస్టెంట్ కి ఇప్పించడానికి ఇండస్ట్రీ నుండి మెగాస్టార్ చిరంజీవి ని గానీ లేదా ఎన్టీఆర్, మహేష్ బాబు ని గాని ఈ ముగ్గురిలో ఎవరో ఒకరిని తీసుకొచ్చి ఆలోచన షో నిర్వాహకులు చేస్తున్నట్లు సరికొత్త టాక్ సోషల్ మీడియాలో వినబడుతుంది. గత సారి చిరంజీవి రావటంతో ఈ సారి మహేష్ గాని ఎన్టీఆర్ గాని వచ్చే అవకాశం ఉందని తాజాగా వచ్చిన వార్తపై సోషల్ మీడియాలో బిగ్గ్ బాస్ ఆడియన్స్ అంచనా వేస్తున్నారు. మరి టైటిల్ విన్నర్ ఇవ్వటానికి ఎవరు వస్తారో చూడాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?