బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో వైల్డ్ కార్డు ద్వారా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన జబర్దస్త్ అవినాష్ 100% ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇంటిలో ఉన్న సభ్యులందరి కంటే అవినాష్ వేసే పంచులు చేసే మిమిక్రీ ఈ సీజన్ లో ఆడియన్స్ ను ఎంతగానో ఎంటర్టైన్ చేసింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉండగా చాలాసార్లు ఎలిమినేషన్ సమయంలో అదేవిధంగా వీకెండ్ ఎపిసోడ్ లలో కష్ట సమయాల లో అవినాష్ డూ ఆర్ డై అనే రీతిలో ఈ హౌస్ లోకి అడుగు పెట్టినట్లు చెప్పుకొచ్చాడు.
బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళితే తనకు అవకాశాలు లేవని ఖచ్చితంగా అందరూ ఆదుకోవాలని నిరుద్యోగ కథలు అవినాష్ తెలపడం జరిగింది. ఇదిలా ఉండగా జబర్దస్త్ లో మెగా బ్రదర్ నాగబాబు న్యాయనిర్ణేతగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ టైములో అవినాష్ కూడా అ టీం నెంబర్ గా ఉంటూ అనేక స్కిట్లు వేయడం జరిగింది.
అయితే ఈ షో తర్వాత తనకి లైఫ్ లేదని హౌస్ లో చెప్పిన అవినాష్ కి.. ఇంటి నుండి బయటకు వచ్చిన వెంటనే మెగా బ్రదర్ నాగబాబు బంపర్ ఆఫర్ ఇవ్వనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మేటర్ ఏమిటంటే నాగబాబు ఆధ్వర్యంలో జీ తెలుగులో ప్రసారమౌతున్న కామెడీ కార్యక్రమం “అదిరింది లో” అవినాష్ ని తీసుకోవడానికి నాగ బాబు డిసైడ్ అయినట్లు సమాచారం. ఇప్పటికే జబర్దస్త్ కామెడీ షో లో అప్పట్లో ఉన్న చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ, ధన్రాజ్, వేణు ఇలాంటి వాళ్లను తీసుకున్న నాగబాబు.. అవినాష్ కూడా అవకాశం ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.