వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ హౌస్ లో వెళ్లే అవకాశం వస్తే వెళ్తారా అని యాంకర్ ప్రశ్నించగా, దానికి ఆర్జివి సమాధానమిస్తూ..నేనొక్కడినే అబ్బాయి అయి ఉండి మిగతా వారంతా అమ్మాయిలు అయితే కచ్చితంగా బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇస్తానని తెలపడం జరిగింది.
ఇదిలా ఉండగా కొద్దిసేపట్లో గ్రాండ్ ఫినాలే కార్యక్రమం స్టార్ట్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోలో హౌస్ లో వైల్డ్ కార్డు రూపంలో ఎంట్రీ ఇచ్చిన స్వాతి.. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి హాజరవడం జరిగింది. ఈ నేపథ్యంలో నాగార్జున ఏం చేస్తున్నారు అని ప్రశ్నించగా రాంగోపాల్ వర్మ తో సినిమా చేస్తున్నట్లు స్వాతి చెప్పుకొచ్చింది.
దీంతో నాగార్జున అయితే నువ్వు జాగ్రత్తగా ఉండాలి అంటూ కామెడీగా ఆర్జివి పరువు తీసేసినట్లు సెటైర్ వేయడం జరిగింది. నాగార్జున ఈ సెటైర్ వేయటంతో హౌస్ లో మిగతా సభ్యులు ఒక్కసారిగా నవ్వటం జరిగింది. ఒక స్వాతి నే మాత్రమే కాక చాలా మంది బిగ్ బాస్ కంటెస్టెంట్ లను నాగార్జున ప్రశ్నించటం జరిగింది. ఏదిఏమైనా గ్రాండ్ ఫినాలే కార్యక్రమం బిగ్ బాస్ షో నిర్వాహకులు భారీ స్థాయిలో ప్లాన్ చేసినట్లు తాజా ప్రోమో బట్టి తెలుస్తోంది.