బిగ్ బాస్ షో సీజన్ ఫోర్ ప్రారంభమయ్యే అప్పుడే ఏడో వారం చివరికి వచ్చేసింది. హౌస్ లో 12 మంది సభ్యులు ఉన్నారు. ఏడుగురు ఎప్పటికి ఎలిమినేట్ అయ్యారు. అయినా కానీ గతంలో మాదిరిగా షోపై పెద్ద గా ఇంట్రెస్ట్ కలిగే రీతిలో ఎలాంటి వ్యవహారం అదేవిధంగా వాతావరణం లేదు అనే టాక్ బయట వినబడుతోంది. దీంతో షోలో స్టార్టింగ్ లో వచ్చిన రేటింగ్స్ ప్రస్తుతం రావటం లేదు అనే వార్తలు వస్తున్నాయి. భారీగా వచ్చిన రేటింగ్స్ కాపాడుకోవడంలో బిగ్ బాస్ షో నిర్వాహకులు ఫీల్ అవుతున్నట్లు బయట టాక్. ఇన్ని రోజులు కావస్తున్న షో లో చెప్పుకోదగ్గ విషయం గానీ ఎపిసోడ్ గానీ పెద్దగా లేదని బయట జనాలు చెప్పుకుంటున్నారు. జరుగుతున్న గొడవలు…. రొమాంటిక్ ట్రాక్ లు కూడా పెద్దగా ఏమీ లేవని తెలుపుతున్నారు.
హౌస్ లో ఎంటర్ టైన్ చేసే ఏకైక వ్యక్తి అవినాష్ అని… అతను కనుక హౌస్ లో లేకపోతే ఇంకా చూడటానికి పెద్దగా ఏమీ ఉండదని సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా సెటైర్లు వేస్తున్నారు. ఇదిలావుండగా తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో లో అమ్మ రాజశేఖర్ తనని తాను ఓ ప్రేమికుడి లాగా ఫీల్ అవుతు… తనని ఎంతగానో అభిమానించే దీని విషయంలో కొంచెం అతిగా సోహైల్ దగ్గర మాట్లాడటంతో ఆయన పై సెటైర్లు వేస్తున్నారు. దివి మొదటి నుండి మాస్టర్ తో ఓ పెద్దరికం తరహాలో గౌరవంగా భావిస్తూ వస్తుంది. అయితే అలా ఉంటే ఇటీవల ఎపిసోడ్ ఉదయం వచ్చే పాటకు మాస్టర్ చాలా చలాకీగా రెచ్చిపోయి స్టెప్పులేశారు.
ఆ విషయాన్ని దివి ప్రస్తావిస్తూ…పొద్దుపొద్దున్నే అంత డాన్స్ ఎలా వేశారని ప్రశ్నించింది. దానికి అమ్మ మాస్టర్… నన్ను ఫాలో అయ్యావా మరీ అని దివి ని ప్రశ్నించారు. అక్కడ ఫాలో అవ్వడానికి మీరు చాలా స్పీడ్ గా డాన్స్ చేశారు అని జవాబిచ్చింది దివి. దానికి సోహెల్ ఈ వయసులో కూడా బాగా డ్యాన్స్ చేస్తున్నాడు అంటూ… డైలాగ్ వేయటంతో దివి అక్కడినుంచి వెళ్లిపోయింది. దానికి మాస్టర్ పక్కన గర్ల్ ఫ్రెండ్ ఉంటే అలా ఎందుకు అలా మాట్లాడతావు? అని సోహెల్ కి డైలాగు వేయటం జరిగింది. దీంతో అమ్మ రాజశేఖర్ పై బయటకు నెటిజన్లు సెటైర్లు వేస్తున్న రు. నీకు ఊరికినే బిగ్ బాస్ హౌస్ లో గుండు గికలే…. కరెక్ట్ గానే గీకారు. ఆ అమ్మాయి నిన్ను గౌరవంగా చూసుకుంటే నువ్వేంటి ఇలాగా… అంటూ అమ్మ రాజశేఖర్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు.