బిగ్ బాస్ హౌస్ లో ఎన్నో చిత్రాలు జరుగుతున్నాయి. అఖిల్ ని ఎలిమినేషన్ పేరిట సీక్రెట్ రూమ్ లోకి పంపించి ఇంటి సభ్యులకు షాకిచ్చే తరహాలో గతవారం వీకెండ్ ఎపిసోడ్లో హౌస్ లోకి రాణించటం జరిగింది. దీంతో ప్రస్తుతం ఇంటిలో గేమ్ ఎవరు ఏ స్ట్రాటజీ తో ఆడుతున్నారు? అనే దాని విషయంలో అఖిల్ కి కొంత వరకు క్లారిటీ వచ్చింది.
దీంతో ఎలిమినేషన్ సమయంలో గొడవలు భారీ స్థాయిలో జరిగాయి. ముఖ్యంగా అఖిల్ మరియు అభిజిత్ ల మధ్య కొట్టుకునే తరహాలో బూతులు కూడా వచ్చే తరహాలో వాదోపవాదాలు జరిగాయి. పరిస్థితి ఇలా ఉండగా షో లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ కుమార్ సాయి తిరిగి ఇంటిలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు ఇటీవల వైరల్ అయిన సంగతి తెలిసిందే.
కాగా ప్రస్తుతం కుమార్ సాయి కరోనా నేపథ్యంలో ఇంటిలో రీ ఎంట్రీ ఇవ్వక ముందు క్వారంటైన్ అబ్జర్వేషన్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే వారంలో కుమార్ సాయి ఇంటిలో అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు లీక్ అవుతున్నాయి. ముఖ్యంగా కుమార్ సాయి ఇంటి నుండి ఎలిమినేట్ అవడం పట్ల అప్పట్లో అనేక విమర్శలు బిగ్ బాస్ షో నిర్వాహకులపై రావటం తెలిసిందే. ఓటింగ్ పరంగా కాకుండా స్క్రిప్టు పరంగా హౌస్ నడుస్తోందని కుమార్ సాయి ఎలిమినేట్ అవ్వాల్సిన క్యాండిడేట్ కాదు అంటూ సోషల్ మీడియాలో అదేవిధంగా బయట జనాలు షో నిర్వాహకులపై తెగ కామెంట్లు చేశారు. ఇటువంటి తరుణంలో బిగ్ బాస్ షోలో కి మళ్లీ కుమార్ సాయి ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు రావడంతో.. హౌస్ లో వాతావరణం విషయాలు ఎలా ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో తెగ చర్చలు జరుపుకుంటున్నారు.