బిగ్ బాస్ హౌస్ లో దీపావళి ఎపిసోడ్ అదరగొట్టేసింది. ఇంటిలో ఉన్న సభ్యుల చేత సరికొత్త గేమ్ లు ఆడించిన నాగార్జున అదే రీతిలో షాకుల మీద షాకులు ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా సీక్రెట్ రూమ్ నుండి అఖిల్ ని బయటకు తెచ్చి ఇంటి సభ్యులకు మతిపోయేలా చేశారు. అదేవిధంగా దీపావళి నేపథ్యంలో ఇంటిలోకి చిచ్చుబుడ్డి, ఆటంబాంబు లతో సరికొత్త గేమ్ ఆడిస్తూ ఇంటిలో పండగ వాతావరణాన్ని సృష్టించారు.
పూర్తి విషయంలోకి వెళితే చిట్టి పొట్టి ఆటంబాంబు లతో ఇంటిలో ఉన్న సభ్యులను కాల్చాలని నాగార్జున తెలిపారు. చిచ్చుబుడ్డి అంటే అంత ఎత్తునే లేస్తారు.. ఏదో చేస్తారని అనుకుంటాం కానీ చివరకు ఏం చేయరు తుస్సుమంటారు. ఆటంబాంబ్ అంటే సైలెంట్గా ఉంటారు..టైం వచ్చినప్పుడు పేలిపోతారు.. ఎవ్వరూ ఊహించరు.. అంచనాలుకు అందరంటూ నాగార్జున రెండింటి గురించి వివరించాడు.
దీంతో ఇంటిలో ఉన్న సభ్యులు ఒక్కొక్కరిని గెలిచింది ఎవరు చిచ్చుబుడ్డి ఎవరు ఆటంబాంబ్ తమ దృష్టిలో అని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఇంట్లో చాలా మంది సభ్యులు చిచ్చుబుడ్డి గురించి వివరిస్తూ చాలామంది సోహెల్ అని తమ అభిప్రాయాన్ని తెలిపారు. ఒకేసారి కోప పడతాడు మరి ఒకేసారి తగ్గి పోతాడు అని తెలిపారు. ఈ క్రమంలో దేత్తడి హారిక చిచ్చుబుడ్డి ఆటంబాంబు ఆటలో సోహెల్ పరువు ఒక్కటే డైలాగుతో తీసేసింది. ఏదో పైలవాన్ లాగా గొడవ పెట్టుకోవడానికి మీద మీద వస్తాడు కానీ హౌస్ లో ఎవరూ అతన్ని పట్టించుకోరు, దేఖరు అని పెద్ద డైలాగ్ వేయటంతో సోహెల్ తెగ ఫీల్ అవుతూనే హారిక పై సీరియస్ అయ్యాడు.