బిగ్ బాస్ సీజన్ ఫోర్ క్లైమాక్స్ కి చేరుకున్న సంగతి తెలిసిందే. ఇంటిలో ఏడుగురు సభ్యులు మాత్రమే మిగిలి ఉండటంతో… హౌస్ లో వాతావరణం రసవత్తరంగా ఉంది. పైగా ఇంకో మూడు వారాల ఆట మాత్రమే మిగిలి ఉండటంతో, ఇంటి సభ్యులు ఎవరికి వారు గెలవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఫ్రెండ్షిప్ ని సైతం పక్కన పెడుతున్నారు.
మొదటి నుండి హౌస్ లో కలిసికట్టుగా ఉన్నవారు చివరికి వచ్చేసరికి విడిపోయే పరిస్థితి వచ్చిందని బయట టాక్. ఇదిలా ఉంటే ప్రస్తుతం “టికెట్ టు ఫినాలే” టాస్క్ కోసం ఇంటి సభ్యులు ఒకరితో ఒకరు తల పడుతున్న సంగతి తెలిసిందే. లెవెల్ వన్ లో పాలు కలెక్ట్ చేసే టాస్క్ లో అవినాష్, అరీయనా, మోనాల్ ఓడిపోవడం జరిగింది.
ఇక లెవెల్ టు కి వచ్చిన అభిజిత్, హారిక, సొహైల్, అఖిల్ లో ఫ్లవర్ గేమ్ లో…హారిక, అభి లు ఓడిపోయినట్లు లిక్ వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా లెవెల్ త్రీ లో బిగ్ బాస్ టాటూ వేయించుకునే టాస్క్ కావటంతో… దీనిలో అఖిల్ టాటూ వేయించుకున్న ట్లు సోహెల్ నిష్క్రమించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇదే టాస్క్ సీజన్ త్రీ లో బిగ్ బాస్ టాటూ వరుణ్ కోసం యాంకర్ శ్రీముఖి వేయించు కోవటం జరిగింది. ఇప్పుడు ఇదే తరహాలో అఖిల్ బిగ్ బాస్ టాటూ వేయించుకున్నట్లు తెలుస్తోంది.