మొన్న దసరా పండుగ రోజు నాడు అక్కినేని కోడలు సమంత బిగ్ బాస్ షోలో హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. మొట్టమొదటిసారి నాగార్జున కోడలు యాంకరింగ్ అదరహో రేంజ్ లో మైమరిపించింది. ఫుల్ ఎనర్జిటిక్ గా చాలా హుషారుగా సమంత దసరా పండుగ రోజు నాడు ఇంటిలో ఉన్న సభ్యులను మాత్రమే కాక చూస్తున్న ఆడియన్స్ ని ఎంతగానో అలరించింది.
ఇంటి సభ్యులతో కలిసిపోయి చాలా సెటైరికల్ గా ఇంటి సభ్యుల లోపాలు బయట పెడుతూ అదరగొట్టే యాంకరింగ్ చేసింది. ఇదిలా ఉండగా త్వరలో దీపావళి సందర్భంగా ఈసారి టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున కొడుకు అక్కినేని నాగ చైతన్య హోస్ట్ గా రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కి కరోనా పాజిటివ్ వచ్చిన సమయంలో ఆయనతో పాటు నాగార్జున కూడా ఉండటంతో… ప్రస్తుతం నాగార్జున హోమ్ క్వారంటైన్ లోకి వెళ్ళినట్లు దీంతో దీపావళి పండుగనాడు తనయుడు నాగ చైతన్య తండ్రి స్థానంలో యాంకరింగ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇదే తరుణంలో తన కొత్త సినిమా లవ్ స్టోరీ విశేషాలు కూడా ఇంటి సభ్యులతో పంచుకొనున్నట్లు టాక్. ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో నెటిజన్లు మరియు బిగ్ బాస్ ఆడియన్స్ సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఏది ఏమైనా నాగార్జున గారు తన ఇద్దరు కొడుకుల తో పాటు కోడలిని తన ప్లేస్ లో నిలబెట్టి షో చూస్తున్న వారికి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారని పొగుడుతున్నారు.