మరి కొద్ది రోజుల్లో బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 మొదలవబోతుంది. గత మూడు సీజన్స్ ఎంతగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయో అందరికీ తెలిసిందే. ఆ మూడు సీజన్స్ కి ధీటుగా సీజన్ 4 ని నిర్వహించాలనుకున్నారు నిర్వాహకులు. అయితే కరోనా కారణంగా షాక్ తగిలింది. ముందు అనుకున్న ప్లాన్ బెడిసి కొట్టిందని అంటున్నారు. దాంతో సీజన్ 4 లో కొన్ని కీలక మార్పులు చేసి నిర్వహించబోతున్నారట.
అయితే ఇప్పుడు వచ్చిన సమస్యంతా కరోనా తో నిర్వాహకులు తీసుకుంటున్న జాగ్రత్తలని సమచారం. అవి జాగ్రత్తలు అనే కంటే అతి జాగ్రత్తలని అనుకోవచ్చు. కరోనాతో జనాలందరూ రక రకాల అనుమానాలతో భయపడుతుంటే అంతకంటే 4 రెట్లు ఎక్కువగా నిర్వాహకులు భయపడుతున్నారట. అందుకే కంటెస్టెంట్స్ విషయంలో మరీ కఠినమగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.
సీజన్ 4 కోసం ఇప్పటికే 16 మంది కంటెస్టెంట్స్ ని ఎంపిక చేసి స్వీయనిర్భంధంలో ఉంచారని సమాచారం. ఈ 16మందికి కోవిడ్ 19 టెస్టులు చేసిన తర్వాత నిర్భంధంలో ఉంచారట. ఇక బిగ్ బాస్ సీజన్ 4 షో ప్రారంభానికి మరికొన్ని రోజుల సమయం మాత్రమే ఉండటంతో నిర్వాహకులు కంటెస్టెంట్స్ పట్ల అతి జాగ్రత్త వహిస్తున్నారట. కోవిడ్ టెస్ట్ లు ప్రతీ రోజూ లేవగానే చేస్తున్నారని తెలుస్తుంది. ఇది ఒక రకంగా ఇబ్బంది కలిగించే విషయం అయినప్పటికి తప్పదు మరి. బిగ్ బాస్ కదా.. 100 రోజులు అందరూ ఒకే ఇంటిలో ఉండాలి కదా.
ఇక ఆగస్టు 30 నుంచి షో మొదలవుతోందని సమాచారం. సీజన్ 3 కి హస్ట్ గా వ్యవహరించిన నాగార్జున అక్కినేని సీజన్ 4 కి హోస్ట్ గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాగార్జున 3 గెటప్పులతో విడుదలయిన సీజన్ 4 ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!