త్వరలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ 4 సీజన్ పై ప్రేక్షకులు గంపెడాశలు పెట్టుకున్నారు. మునుపటి మూడు సీజన్ల కన్నా ఇది ఇంకా అద్భుతంగా ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
మూడో సీజన్కు యాంకరింగ్ చేసిన కింగ్ నాగార్జునే మళ్లీ ఫోర్త్ సీజన్ కి హోస్ట్ గా ఉండడంతో ఆయన అభిమానులు ఉబ్బితబ్బిబవుతున్నారు. అయితే వారందర్నీ నిరాశపరిచే విషయాలు ఇప్పుడిప్పుడే వెలుగుచూస్తున్నాయి.కరోనా కారణంగా షో ఫార్మెట్లో పలు మార్పులు చేర్పులు చేశారట. ఇప్పటి వరకు బిగ్బాస్ షో అంటే నిన్న హౌస్ లో జరిగిన విశేషాలను తర్వాత రోజు ఎపిసోడ్లో ప్రసారం చేసేవారు.
అంటే సోమవారం ప్రసారం అయ్యే ఎపిసోడ్ ఆదివారం జరిగిందన్నమాట.ఈ విధానం పూర్తిగా మారిపోయిందట .ప్రొడక్షన్ వర్గాల కథనం ప్రకారం బిగ్ బాస్ ఫోన్ సీజన్లో ఈ వారం హౌస్లో జరిగిన దాన్ని వచ్చే వారం చూపిస్తారట.ఈ ఆదివారం షూట్ చేసిన కార్యక్రమాలు సంఘటనలు వచ్చే ఆదివారం ప్రసారం అవుతాయన్నమాట. అంటే వారం రోజుల పాటు ఆ ఎపిసోడ్ కోసం వేచి ఉండాలన్న మాట. బిగ్బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఆరోగ్యం ,ఇతరత్ర విషయాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్. కరోనా కారణంగా షోను ఒక్క రోజు గ్యాప్లో ప్రసారం చేయడం సాధ్యం కాదని అందుకే వారం రోజులు గ్యాప్ ఇచ్చి ఆ గ్యాప్ లో ఎడిటింగ్ చేసి ప్రసారం చేస్తారనే టాక్ వినిపిస్తుంది.
ఇది నిజమైతే మాత్రం బిగ్ బాస్ ఫోర్ సీజన్ ప్రేక్షకాదరణ కోల్పోతుందని బుల్లితెర వర్గాలు చెబుతున్నాయి.బిగ్ బాస్ అనేది ఒక ఫ్లో తో కూడిన కార్యక్రమమని .. దాన్ని విపరీతమైన గ్యాప్ ఇచ్చి ప్రచారం చేస్తే చూసే ప్రేక్షకులు ఉండరు అంటున్నారు. అయితే కరోనా సీజనే తమకు కలిసి వచ్చే కాలం అని, ప్రేక్షకులకు ఎటువంటి వెరైటీ టీవీ కార్యక్రమాలు అందుబాటులో లేనందున తప్పనిసరిగా తమ ప్రోగ్రాం చూస్తారని బిగ్ బాస్ యూనిట్ అంచనా వేస్తోంది.పైగా నాగార్జున యాంకరింగ్ అదనపు ఆకర్షణ అంటున్నారు.
మూడో సీజన్లోనే బ్రహ్మాండంగా ప్రేక్షకులను అలరించిన నాగార్జున నాలుగో సీజన్లో కూడా బిగ్ బాస్ ప్రేక్షకులను సమ్మోహన పరుస్తారని ఆ యూనిట్ ధీమాగా ఉంది. కింగ్ నాగ్ పుట్టిన రోజైన ఆగస్టు 29 నాడు ఈ సీజన్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ప్రేక్షకుల అభిరుచి ఏమిటో తెలుసుకోవడానికి అప్పటి వరకు ఆగక తప్పదు కదా!