బిగ్ బాస్ సీజన్స్ లో పాల్గొన్న పార్టిసిపెంట్స్ ఎలిమినేట్ అయి బయటకి వచ్చాక పాజిటివ్ గా చెప్పినవాళ్ళు చాలా తక్కువ. ఉన్నది ఉన్నట్టు గా చూపించరని… చాలా ఎడిట్ చేసి ఎవాళ్ళకి అవసరమైందే చూపించి మిగిలిన విషయాలన్ని దాచేస్తారంటూ.. పలు ఆసక్తికరమైన విషయాలను బయటకి చెబుతుంటారు. కాగా ప్రస్తుతం సాగుతున్న సీజన్ 4 నుండి బయటకు వచ్చిన న్యూస్ ప్రజెంటెర్ దేవీ నాగవల్లి కూడా చాలా విషయాలను వెల్లడిస్తోంది.
హూస్ నుంచి బయటకి వచ్చాక బిగ్బాస్ హౌస్, బిగ్బాస్ టీమ్ మీద చేస్తున్న విమర్శలు హాట్ టాపిక్ గా మారాయి. జెన్యూన్గా ఉండేవాళ్లు బిగ్బాస్ హౌస్లో ఉండకూడదా అంటూ డైరెక్ట్ గా అడిగేసింది. అంతేకాదు నేనేంటో బయట చాలామందికి తెలియదు. రిపోర్టర్ అని మాత్రమే తెలుసు. కానీ బిగ్బాస్కు వెళ్లడం వల్ల కోట్లమందికి నేనేంటో తెలిసింది. అందుకే గతంలో నన్ను విమర్శించినవాళ్లు ఇప్పుడు సపోర్టు చేస్తున్నారు. అందుకే నేను ఎలిమినేట్ అయినా, నన్ను మళ్లీ ఇంట్లోకి తీసుకురమ్మని సోషల్ మీడియా ద్వారా సలహాలిస్తున్నారు.
అయితే ఇప్పటికి నేను నేను ఎందుకు బయటకు వచ్చాను అన్న విషయంలో క్లారిటీ రావడం లేదు. ఓట్లు తక్కువ రావడంతోనే నేను ఎలిమినేట్ అయ్యానని అంటున్నారు. అయితే బయటికొచ్చాక ‘నా కంటే తక్కువ ఓట్లు వచ్చినవాళ్లు ఉన్నారని తెలిసింది’. ఇదేంటో అర్థం కావడం లేదు అని షాకవుతోది.
కాగా బిగ్బాస్ టీమ్ ఎక్స్పెక్ట్ చేసిన డ్రామా నేను ఇంట్లో క్రియేట్ చేయలేకపోతున్నానని నన్ను బయటకు తీసుకొచ్చేశారని అనుకుంటున్నాను. టాస్క్లు బాగా చేస్తున్నాను, అవసరమైనంతవరకు ఎంటర్టైన్మెంట్ కూడా బాగానే ఇస్తున్నా.
అయితే ఇంకా ఏదో నా నుంచి ఆశిస్తున్నారని అనిపిస్తోంది… అంటూ వెల్లడించింది. అంతేకాదు షో స్క్రిప్టు ప్రకారం నడుస్తోందా లేదా అన్న కన్ఫ్యూజన్ లో ఉందట. ఇప్పుడు ఇంట్లో ప్రస్తుతం ఉన్నవారిలో ఎవరు గెలుస్తారనే విషయంలో ఇంకా స్పష్టత రావడం లేదు. అయితే గంగవ్వను ఫిజికల్ టాస్క్ల విషయంలో ఇన్వాల్వ్ చేస్తే టైటిల్ ఆమెదే అంటూ అభిప్రాయాన్ని వెల్లడించింది దేవీ.