13వ వారం స్టార్ట్ అయ్యే సరికి బిగ్ బాస్ హౌస్ లో అద్భుతాలు జరుగుతున్నాయి. ఇంటిలో సభ్యులు ఎవరికి వారు స్ట్రాటజీని వేసిన గాని పెద్దగా పని కావటం లేదు. ఇంటి సభ్యుల ప్లానింగ్ లు తలకిందులు అయ్యేలా బిగ్ బాస్ హౌస్ లో సరికొత్త వాతావరణం ఎప్పటికప్పుడు మారిపోయేలా గజిబిజి గేములు ఆడిస్తూ బయట ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడంతోపాటు ఇటిలో ఉన్న సభ్యులకి చుక్కలు చూపిస్తున్నారు.
ఇంకా మూడు వారాల ఆట మాత్రమే మిగిలి ఉండటంతో ప్రస్తుతం హౌస్ లో ఉన్న సభ్యులు ఎవరికి వారు గెలవటానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలావుండగా సోమవారం ఎలిమినేషన్ ప్రక్రియ ముగియగానే టికెట్టు ఫినాలే రేస్ అంటూ సరికొత్త మెడల్ కోసం ఇంటి సభ్యుల మధ్య పోటీ పెట్టారు బిగ్ బాస్.
ఈ మెడల్ గెలిచిన వారు ఖచ్చితంగా ఫినాలే కే వెళ్లిపోతారని బిగ్ బాస్ ప్రకటించడంతో … ఆవు దగ్గర పాలు పొందు కోవటం కోసం ఒకరితో ఒకరు గొడవ పడుతూ మరి తమ దగ్గర పాలు ఎక్కువ ఉండేలా ఆట ఆడారు. ఇదిలా ఉండగా లీక్ వార్తల ప్రకారం ఈ టాస్క్ లో లెవెల్ 2 కి వెళ్లిన వారి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లీకైన వార్తల ప్రకారం లెవెల్ టు కి అభిజిత్, అఖిల్, సోహెల్, హారిక వెళ్ళినట్లు తెలుస్తుంది. దీంతో సీజన్ ప్రారంభమైన నాటి నుండి హౌస్ లో బాగా యాక్టివ్ గా ఉండే ఇంటి సభ్యులు మాత్రమే నెక్స్ట్ లెవెల్ కి వెళ్లినట్లు బయట జనాలు తాజాగా వచ్చిన ఈ వార్తపై కామెంట్లు చేస్తున్నారు.