తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో లభిస్తున్నా రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ ఫోర్ ఏడవ వారం లో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. షో కి వస్తున్న ఆదరణ టిఆర్పి రేటింగ్ లలో రికార్డు లు క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ లు మొదటివారం నుండే ఉండేవిధంగా షో నిర్వాహకులు ప్లాన్ చేయటంతో… చూస్తున్న ప్రేక్షకులకు షో పై మరింత ఆసక్తి పెరిగింది. ఇప్పటివరకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇంటి లోకి ఎంటరైన కుమార్ సాయి, స్వాతి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో సింగర్ మంగ్లి త్వరలో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా రెండో సీజన్ విన్నర్ కౌశల్ తాజాగా ప్రసారమౌతున్న సీజన్ ఫోర్ పై తన అభిప్రాయాన్ని తెలిపారు. హౌస్ లోన్ ఇస్తున్న టాస్క్ లు గతంలో ఇచ్చినవే అని పెదవి విరిచారు. కాస్త కొత్త టాస్క్ లు ప్రవేశపెట్టాలని బిగ్ బాస్ ని కోరుతున్నట్లు తెలిపాడు. అంతేకాకుండా గతంలో కొన్ని లవ్ ట్రాక్ లను ఈ సీజన్ లో కూడా అప్లై చేయాలని.. ప్లాన్ చేసారని కానీ అది బెడిసికొట్టిందని తన అభిప్రాయాన్ని తెలిపాడు.
అభిజిత్- అఖిల్- మోనల్ ట్రయాంగిల్ స్టోరీ విషయంలో ఇది స్పష్టంగా అర్థమవుతుందని చెప్పుకొచ్చాడు. కాగా హౌస్ లో బలమైన కంటెస్టెంట్ ల విషయంలో తన అభిప్రాయాన్ని తెలుపుతూ సోహెల్..గతంలో మాదిరిగా కాకుండా తన ఆవేశాన్ని తగ్గించుకున్నాడు కచ్చితంగా టాప్ ఫైవ్ లో ఉంటాడు అని అన్నారు. అంతే కాకుండా అభిజిత్, నోయల్, లాస్య అదేవిధంగా అవినాష్ వీళ్లు గ్యారెంటీగా టాప్ ఫైవ్ లో ఉండటం తథ్యమని జోస్యం చెప్పాడు.