బిగ్ బాస్ సీజన్ ఫోర్ క్లైమాక్స్ దశకు చేరుకుంది. దీంతో ఇంటిలో ఉన్న కంటెస్టెంట్ లు ఎవరికి వారు టైటిల్ విన్నర్ కొట్టడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం మీ ఇంటిలో ఏడుగురు సభ్యులు మాత్రమే మిగిలి ఉన్నారు. దీంతో బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లు హౌస్ లో సరికొత్త వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాయి.
సోమవారం జరిగిన నామినేషన్ ఎపిసోడ్ లో చాలా క్లోజ్ అనుకొన్న కంటెస్టెంట్ ల మధ్య గొడవలు జరగడం మనం అందరం చూశాం. ఇదిలా ఉంటే టికెట్టు ఫినాలే రేస్ అని తాజాగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో కూడా ఇంటి సభ్యుల మధ్య గొడవలు జరుగుతున్నట్లు తాజా ప్రోమో బట్టి అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ టాస్క్ లో ముందంజలో లీక్ వార్తల ప్రకారం అఖిల్, సోహెల్, అభిజిత్, హారిక ముందంజలో ఉన్నట్లు వార్తలు సోషల్ మీడియాలో లీకయ్యాయి.
దీంతో టాస్క్ లో అతి తక్కువ పాలు సేకరించింది అరీయనా, అవినాష్, మోనాల్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ ముగ్గురు టికెట్టు ఫినాలే రేసులో వెనకబడి పోయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.ఇదిలా ఉండగా ఈ టాస్క్ లో అఖిల్ అదేవిధంగా సోహెల్ కలిసి ఆడుతున్నట్లు అభిజిత్ వాళ్ళిద్దరి పై సీరియస్ అయినట్లు తెలుస్తుంది. మొత్తంమీద చూసుకుంటే మంగళవారం జరగబోయే ఎపిసోడ్ లో సీజన్ త్రీ లో పంపు దగ్గర నీళ్లు అప్పట్లో ఇంటి సభ్యులు ఎలా పట్టుకున్నారో ఈసారి ఆవు దగ్గర నుండి పాలు పిత్తుకోవడం అనే టాస్క్ తరహాలో బిగ్ బాస్ ఇంటి సభ్యులను ఆడిస్తున్నట్లు తెలుస్తుంది