బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ ఫోర్ చివరి దశకు చేరుకుంది. వైల్డ్ కార్డు లతో కలిపి 19మంది హౌస్ లో ఎంటర్ అవ్వగా ప్రస్తుతం ఆరుగురు మాత్రమే మిగిలి ఉన్నారు. దీంతో వచ్చే వారం ఎవరు ఇంటి నుండి ఎలిమినేట్ అవుతారన్నది సస్పెన్స్ లో ఉంది. అఖిల్ ఇప్పటికే ఫైనల్ విక్ కీ వెళ్లిపోవడం జరిగింది. దీంతో అభిజిత్, సోహెల్, అరియనా, హారిక, మోనాల్ ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు.
నామినేట్ అయిన వీరిలో అభిజిత్, సోహెల్, అరియనా కి బయట నుంచి సపోర్టు గట్టిగా ఉంది. దీంతో బయట జరుగుతున్న డిస్కషన్ ప్రకారం వచ్చేవారం హారిక లేదా మోనాల్ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నారు. ఈ వారం ముగియగానే వచ్చేవారం పెద్దగా టాస్క్ లు ఉండకపోవడం ఏమీ ఉండదని అంచనా వేయొచ్చు.
కానీ ఎప్పటిలాగా హౌస్ లో చివరి వారంలో ఇంటిలోకి అందరూ బిగ్ బాస్ సభ్యులు వచ్చే అవకాశం ఈసారి లేనట్లు వార్తలు అందుతున్నాయి. ప్రతి సీజన్లో టాప్ ఫైవ్ లోకి వెళ్ళిన బిగ్ బాస్ కంటెస్టెంట్ లను.. ఆ సీజన్ లో హౌస్ లో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు కలుసుకుంటారు. కానీ ఈసారి మాత్రం కరోనా కారణంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంట్లో ఉన్న టాప్ ఫైవ్ కంటెస్టెంట్ లతో ముచ్చటించడం ఉంటుందని సరికొత్త టాక్ వినబడుతోంది. చాలా వరకు కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా హైదరాబాదులో ఉండటంతో బిగ్ బాస్ షో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు, షో క్లైమాక్సు కి చేరుకున్న సమయంలో ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండటానికి జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం.