బిగ్ బాస్ సీజన్ ఫోర్ గ్రాండ్ ఫినాలే ఆదివారం కావడంతో ఈ ఎపిసోడ్ కోసం బిగ్ బాస్ ఆడియన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. చీఫ్ గెస్ట్ ఎవరు వస్తారు అన్న దానిపై రకరకాల పేర్లు సోషల్ మీడియాలో వినబడుతున్నాయి. ప్రారంభంలో ఎన్టీఆర్ గానీ లేదా మహేష్ బాబు గానీ వస్తున్నారని వార్తలు రాగా ఇటీవల మెగాస్టార్ చిరంజీవి రెండోసారి టైటిల్ ఇవ్వడానికి రెడీ అయినట్లు వార్తలు వచ్చాయి.
ఇటువంటి తరుణంలో తాజాగా మరో కొత్త వార్త గ్రాండ్ ఫినాలే చీఫ్ గెస్ట్ విషయంలో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మేటర్ లోకి వెళ్తా కుర్ర హీరో నాగచైతన్య ఈసారి గ్రాండ్ ఫినాలే కి గెస్ట్ గా రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో “లవ్ స్టోరీ” సినిమా చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు బిగ్ బాస్ వేదిక ఆధారం చేసుకుని స్టార్ట్ చేయడానికి నాగార్జున కొడుకు చైతు కి ఈ ఆఫర్ ఇచ్చినట్లు టాక్ వస్తోంది.
ఇదే గనుక నిజమైతే ఈ సీజన్ లో తండ్రి కొడుకులు అదేవిధంగా కోడలు బిగ్ బాస్ ఆడియన్స్ ని అలరించినట్లు అవుతోంది. ఇదిలా ఉండగా ఈ సారి టైటిల్ లేడీ కంటెస్టెంట్ గెలుచుకునే అవకాశాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో హాట్ టాక్ నడుస్తుంది.