Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ సెకండ్ వీక్ రచ్చ రచ్చగా సాగుతోంది. హౌస్ లో వాతావరణం నువ్వా నేనా అన్నట్టు గా మారిపోయింది. సరియు ఎలిమినేట్ కావడంతోపాటు బిగ్ బాస్ హౌస్ లో తనకి నచ్చని వారి పై సంచలన కామెంట్స్ చేసి వెళ్ళిపోవటం తో.. హౌస్ లో వాతావరణం రసవత్తరంగా ఉంది. ఇటువంటి తరుణంలో మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోయే ఎపిసోడ్లో ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ కానున్నట్లు ప్రోమో ద్వారా తెలుస్తోంది. ఈ క్రమంలో శ్వేత, ఉమాదేవి భయంకరంగా అరుపులు కేకలు పెట్టినట్లు తెలుస్తుంది.
పరిస్థితి ఇలా ఉండగా ఉమాదేవిని.. ప్రియాంక సింగ్ పోవే అని కామెంట్ చేయటం ప్రోమోలో సంచలనంగా మారింది. ఇదే తరుణంలో షణ్ముఖ్ జస్వంత్ కూడా ఈసారి గట్టిగానే మాట్లాడినట్లు.. ఎలిమినేషన్ కి నామినేషన్ ప్రక్రియ విషయంలో గట్టిగానే తన వాయిస్ ని పెంచినట్లు తెలుస్తోంది. మొత్తంమీద చూసుకుంటే సెకండ్ వీక్ ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ రెండు గ్రూపుల మధ్య నిర్వహించడంతో.. ఎపిసోడ్ పై ఆసక్తి పెరిగింది. శ్వేత నామినేషన్ చేసే వారి ముఖం పై రంగు పోయాల్సిన టైంలో హమీద ముఖం మీద చాలా గట్టిగా కొట్టడం కూడా ప్రోమో లో హైలెట్ గా మారింది.
మొత్తంమీద చూసుకుంటే ఈ సారి.. సెకండ్ వీక్ లో ఎగ్జామినేషన్ కి నామినేట్ అయిన సభ్యుల లిస్ట్ చూస్తే.. ఆర్ జే కాజల్, యాని, లోబో, ఉమా దేవి, ప్రియా, ప్రియాంక, నటరాజ్. వీళ్ళందరి లో ఎక్కువ అవకాశాలు ఉమాదేవి.. ఇంటిలో నుండి వెళ్ళిపోవటం గ్యారెంటీ అని వ్యవహరిస్తున్న తీరుపై బయట జనాలు కామెంట్ చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా నా సెకండ్ వీక్ ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ ఇంటి సభ్యుల మధ్య నువ్వానేనా అన్నట్టుగా ఈగోల దాకా.. పాకిపోయింది. కొంతమంది ఇంటి సభ్యుల లో రెండో వారానికి చేంజ్ వచ్చినట్లు .. వారు వ్యవహరిస్తున్న తీరు బట్టి అర్థమవుతుంది.