Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ దాదాపు చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో హౌస్ లో ఎవరు టాప్ ఫైవ్ లో ఉంటారు ?, ఎవరు టైటిల్ గెలుస్తారు అనేదాని గురించి బయట భారీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. కచ్చితంగా టాప్ ఫైవ్ లో షణ్ముక్, యాంకర్ రవి(Ravi), సన్నీ, శ్రీరామ్ తో పాటు మానస్ లేదా కాజల్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బయట గట్టి టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే ఈ ఆట చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో..బిగ్ బాస్(Bigg Boss) ఇంటిలో ఉండే సభ్యులకు ప్రతి సీజన్ లో రిలీఫ్ కోసం సర్ ప్రైజ్ లు ఇస్తూ ఉంటారు అన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఇంటిలో ఉండే సభ్యులకు… సొంత కుటుంబ సభ్యులను చూడాలనే కోరిక.. ఎక్కువగా ఉండటం ఇదే సమయంలో హౌస్ లో ఉండే ఇంటి సభ్యులకు… వారి కుటుంబ సభ్యులను ఇంటిలోకి పంపించి.. సర్ ప్రైజ్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఇదే తరహాలో హౌస్ లో ఇద్దరు ఇంటి సభ్యులకు… సంబంధించి కుటుంబ సభ్యులను ఈ వారం బిగ్ బాస్.. హౌస్ లోకి పంపించడానికి ఏర్పాటు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ ఇద్దరు కుటుంబ సభ్యులు మరెవరో కాదు.. షణ్ముఖ్(Shanmuk), పింకీ(Pinky) అని సమాచారం. లీక్ వీరులు నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈవారం షణ్ముక్ లవర్ దీప్తి సునయన నీ.. హౌస్ లోకి పంపించడానికి ఏర్పాటు చేయడం జరిగిందట. ఇక ఇదే తరుణంలో ట్రాన్స్ జెండర్ పింకీ.. తల్లిదండ్రులు కూడా బిగ్ బాస్ (Bigg Boss) హౌస్ లో.. రానున్నట్లు, బిగ్ బాస్.. షణ్ముఖ్ పింకీ కి ఈ రీతిలో బిగ్ సర్ ప్రైజ్ ప్రిపేర్ చేయడం జరిగింది అనే టాక్ బయట నడుస్తోంది.
ఇదిలా ఉంటే షణ్ముక్, పింకీ హౌస్లో ప్రారంభంలో చాలా క్లోజ్ గా ఉండటం జరిగింది. కానీ తర్వాత మెల్ల మెల్లగా వీరిద్దరి మధ్య డిస్టెన్స్ మొదలయ్యింది. ఇదే క్రమంలో దాదాపు రెండు వారాల పాటు వరుసగా షణ్ముక్.. పింకీ ని నామినేట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో పింకీ.. షణ్ముఖ్ పై కొన్ని అనవసరమైన పదాలు వదిలేసింది. హౌస్ లో విరీ పరిస్థితి ఇలా ఉంటే..బిగ్ బాస్(Bigg Boss) .. వీరిద్దరికీ సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్టు వార్త రావడం సంచలనంగా మారింది. ఎప్పటినుండో షణ్ముక్.. దీప్తిని కలవరిస్తూ ఉన్నాడు. పింకీ కూడా తన తల్లిదండ్రులు తన పట్ల గర్వ పడటం.. మాత్రమే కాక ట్రాన్స్జెండర్ గా.. అంగీకరించటం తో.. ప్రారంభంలోనే సంతోషంగా ఉంది. ఇదిలా ఉంటే మొట్టమొదటిసారి ట్రాన్స్ జెండర్ గా మారిన తర్వాత పింకీ.. తల్లిదండ్రులు బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లోకి వస్తున్నట్లు వార్త రావటం తో.. కచ్చితంగా ఈ ఎపిసోడ్ హైలెట్ అవుతుందని.. బయట ఆడియన్స్ చెప్పుకొస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?