మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 3, సీజన్ ఫోర్ కి టైటిల్ విన్నర్ ప్రకటించడానికి వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో హౌస్ లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన అమ్మ రాజశేఖర్ ఉన్న తొమ్మిది వారాలు అద్భుతంగా ప్రేక్షకులను అలరించడం జరిగింది. ఇదిలా ఉండగా సీజన్ ఫోర్ టైటిల్ ప్రకటించడానికి వచ్చిన చిరంజీవి.. అమ్మ రాజశేఖర్ గురించి మాట్లాడుతూ అతనికి 15 లక్షలు అడ్వాన్స్ ఇవ్వటం జరిగింది.
దర్శకునిగా అతడు ఇండస్ట్రీకి పరిచయం కాకముందే తనతో సినిమా తెరకెక్కించాలని ప్రయత్నాలు చేశాను ఎప్పటికీ తెరకెక్కించ లేదని అన్నారు. అటు చిరంజీవి చేసిన వ్యాఖ్యలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అమ్మ రాజశేఖర్ స్పందించడం జరిగింది. మెగాస్టార్ కోసం అప్పట్లో గబ్బర్ సింగ్ లాంటి స్టోరీని సిద్ధం చేయడం జరిగిందని కానీ తర్వాత అవకాశం దొరకలేదని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే చిరంజీవి ఇటీవల లూసీఫర్, వేదాళం రీమేక్ లలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరంజీవి రీమేక్ లలో నటించడం వలన పెద్దగా లాభం ఉండదని అన్నారు. అంతేకాకుండా రీమేక్ సినిమాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి చిరంజీవి చాలా పెద్ద తప్పు చేస్తున్నారని తనకు అనిపిస్తోందని అమ్మ రాజశేఖర్ చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా ఉన్న చిరంజీవి ఒరిజినల్ స్టోరీ లో నటిస్తేనే బాగుంటుందని తెలిపారు.