రాష్ట్రంలో వరసగా దళితులపై దాడులు జరుగుతున్నట్లుగా తాజా ఘటన చూస్తే తెలుస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. బిగ్ బాస్ కు వెళ్లి ఫేమస్ అయిన నూతన్ నాయుడు తర్వాత రాజకీయ, సినీ విశ్లేషకునిగా తన కెరీర్ ను కొనసాగిస్తున్నాడు.
అయితే ఈయన తప్పు చేసాడని, విశాఖలోని తన ఇంట్లో పనిచేసే ఒక దళిత యువకుడికి శిరోముండనం చేసాడని అంటున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు కూడా నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే తూర్పు గోదావరి జిల్లాలో ఒక దళిత యువకుడిగా శిరోముండనం జరిగింది. అధికార పార్టీకి చెందిన నేత ఒకరు ఈ పని చేయించారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై రాష్ట్రపతి కూడా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. ఇకపోతే తాజా ఘటన నిజంగా నూతన్ నాయుడు చేసిందేనా? ఈ ఘటనకు జనసేన పార్టీకి ఎందుకు లింక్ పెడుతున్నారు? వంటి విషయాలు తెలియాల్సి ఉంది.