బిగ్ బాస్ షో చాలా రసవత్తరంగా సాగుతోంది. సగానికిపైగా గేమ్ అవటంతో ఇంటిలో వాతావరణం కంటెస్టెంట్ ల మధ్య నువ్వా నేనా అన్నట్టు గా ఉంది. ఇదిలా ఉండగా ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది అన్న సంగతి తెలిసిందే. దీంతో మెగా అభిమానులు సోషల్ మీడియాలో చిరంజీవి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
మరోపక్క చిరంజీవి తనకి కరోనా లక్షణాలు లేకపోయినా గాని ఆచార్య సినిమా షూటింగ్ కోసం పరీక్షలు చేయించుకో గా వచ్చినట్లు సోషల్ మీడియాలో తెలిపారు. అయితే ఈ సందర్భంలో ఇంటిలోనే చికిత్స తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలో తన ని కాంటాక్ట్ అయిన వారు కొంచెం జాగ్రత్తగా ఉండి పరీక్షలు చేయించుకోవాలని చిరంజీవి కోరడం జరిగింది.
దీంతో రెండు రోజులు ముందే చిరంజీవి కింగ్ నాగార్జునతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఒక ఫిలిం స్టూడియో ఈ విషయానికి సంబంధించి మాట్లాడటం కోసం కలవడం జరిగింది. ఇదే సందర్భంలో చిరంజీవి నాగార్జున మాస్క్ లేకుండా దగ్గర దగ్గర ఆ కార్యక్రమంలో కనిపించడం జరిగింది. దీంతో ఇప్పుడు నాగార్జునకి కూడా కరోనా వచ్చిందేమో అనే వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. అంతేకాకుండా ఆదివారం జరిగిన బిగ్ బాస్ షోలో తన పక్కనే ఉన్న యాంకర్ సుమ తో ఎంట్రీ ఇవ్వడం ఆ తర్వాత సుమా హౌస్ లోకి వెళ్లడం వల్ల..బిగ్ బాస్ హౌస్ లో కూడా కరోనా ప్రవేశించింది ఏమో అన్న అనుమానాలు బయట జనాల లో కలుగుతున్నాయి.