సీజన్ ఫోర్ బిగ్ బాస్ కంటెస్టెంట్ లు ఎవరికి వాళ్లు బయట వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నారు. అంతకుముందు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లు కూడా ఫుల్ బిజీ గా ఉంటూ అప్పట్లో రాణించారు. టైటిల్ విన్నర్ ప్రకటించి మూడు వారాలు అయిపోతున్నా గాని ఇప్పటి వరకు బిగ్ బాస్ సీజన్ ఫోర్ కంటెస్టెంట్ లు అందరూ ఒకచోట కలుసుకున్న సందర్భం లేదు.
ఇదే విషయాన్ని కంటెస్టెంట్ లు ఎవరికి వాళ్లు ఇంటర్వ్యూలో చెప్పుకొస్తున్నారు. ఇటువంటి తరుణంలో బిగ్ బాస్ హౌస్ లో టాప్ కంటెస్టెంట్ గా రాణించిన మోనాల్ ఒకడుగు ముందుకు వేసి బిగ్ బాస్ సీజన్ ఫోర్ ఏంటి సభ్యులందరికీ గెట్ టుగెదర్ పార్టీ తన రాష్ట్రం గుజరాత్లో ఏర్పాటు చేసినట్లు తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వినపడుతోంది.
పూర్తి విషయంలోకి వెళితే త్వరలోనే హైదరాబాద్ నగరం లో సొంత ఇల్లు కొనే ఆలోచనలో ఉన్న ఈ గుజరాతి ముద్దుగుమ్మ… దాని కంటే ముందుగానే బిగ్ బాస్ ఇంటి సభ్యులందరికీ గుజరాత్ లో ఓ రిసార్టులో భారీ స్థాయిలో గెట్ టుగెదర్ పార్టీ అరేంజ్ చేయటానికి ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టాక చాలా అవకాశాలు వస్తున్న తరుణంలో తల్లి పర్మిషన్ కూడా ఇవ్వడంతో మోనాల్ అదేవిధంగా సోహెల్ కలసి ఆలోచన చేసినట్లు సమాచారం.