Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ 31 వ రోజు రచ్చరచ్చగా మారింది. హౌస్ లో కెప్టెన్ శ్రీరామ్ తో జెస్సీ కి జరిగిన గొడవ… అనేక గొడవలకు దారి తీసింది. ఈ క్రమంలో మానస్ కి.. శ్వేతా కి కూడా గొడవ జరిగే పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా గొడవలు జరుగుతూ ఉన్న తరుణంలో కాజల్ రవి ని అదే రీతిలో లోబో నీ .. విమర్శ చేయడం జరిగింది. నెల రోజుల నుండి బాత్రూమ్లు కడుగుతారు కిచెన్ డిపార్ట్మెంట్ తప్పించుకున్నారు.. అన్నట్టుగా స్టేట్మెంట్ కాజల్ రిలీజ్ చేయడంతో ..లోబో.. ఫీల్ అయ్యి.. పడుకుంటూ మిడిల్ ఫింగర్ చూపించాడు. దీంతో వెంటనే కాజల్ లోబో నీ.. అలా చేయటం బట్ట నిలదీయడం జరిగింది.
ఈ క్రమంలో రవి కలుగజేసుకొగా.. నీకు మెచ్యూరిటీ ఉంది అర్థం చేసుకోవాలి నువ్వు చేసింది జోక్ కాబట్టి అది కూడా అలాగే తీసుకోవాలి అని.. చెబుతాడు. అయినా కానీ కాజల్ ఈ గొడవ పెద్ద పెద్దగా చేస్తూ పలువురు దగ్గర ప్రస్తావించగా ఇదే విషయాన్ని పింకీ తెలపడంతో.. నాకే గనుక మిడిల్ ఫింగర్ చూపిస్తే నరికేస్తా అని స్పష్టం చేసింది. ఈ తరుణంలో కాజల్ బిగ్ బాస్ హౌస్ లో.. హింసకు తావు లేదు అని పేర్కొంది. ఏది ఏమైనా కాజల్ వాళ్లని రెచ్చగొట్టి తిట్టించుకునట్లు.. తాజా ఎపిసోడ్ చూసిన జనాలు చెప్పుకొస్తున్నారు.
వాళ్ళిద్దరినీ బ్యాడ్ చేయాలని
కాజల్ అందరి ముందు వాళ్ళిద్దరినీ బ్యాడ్ చేయాలని చూసిందని ఫెయిల్ అయిందని అంటున్నారు. ఈ గొడవ చినికి చినికి గాలివానగా మారి పెద్ద గొడవగా సాగింది. ఏది ఏమైనా 31వ రోజు ఎపిసోడ్ లో మాత్రం ఉన్న 15 మంది ఇంటి సభ్యుల మధ్య భారీ ఎత్తున గొడవలు అయ్యాయి. ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే కెప్టెన్ శ్రీరామ్… షణ్ముఖ్ జస్వంత్ వయసు గురించి వైరల్ కామెంట్ చేశారు.
కెప్టెన్సీ టెండర్ టాస్క్ ప్రారంభం
ఈ క్రమంలో కెప్టెన్సీ టెండర్ టాస్క్ ప్రారంభం కావడంతో రెండు రాజ్యాలు గా రవి సన్నీ సామ్రాజ్యాలు.. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్నాయి. ఈ రెండు రాజ్యాల మధ్య భీకరమైన పోరు.. ఏంటో ఈ రోజు ఎపిసోడ్ లో తెలియనుంది. ప్రజలకు నాణాలు అందించడానికి ఇద్దరు రాజులకు నిధులు కలిగిన నాణేల పెట్టి ఇవ్వటం జరిగింది.