బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ప్రారంభం కాకముందే ఎన్నో అడ్డంకులు వస్తున్నాయి. మామూలుగా కాదు.. ముందు కరోనా దెబ్బ.. ఇప్పుడు కంటెస్టెంట్ల దెబ్బ. ఏం చేయాలో తెలియక బిగ్ బాస్ నిర్వాహకులు తలలుపట్టుకుంటున్నారు.
బిగ్ బాస్ షో ను స్టార్ట్ చేయడానికి ఇప్పటికే అన్ని రకాలుగా ప్లాన్ చేసుకుంది బిగ్ బాస్ యాజమాన్యం. నిజానికి బిగ్ బాస్ షో గత నెల 30నే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ.. సింగర్ నోయల్ కు కరోనా రావడంతో మళ్లీ అందరికీ టెస్టులు చేయించి.. షోను వాయిదా వేశారు.
సెప్టెంబర్ 6న సాయంత్రం 6 గంటలకు షో ప్రారంభం కానుంది. ఇక కంటెస్టెంట్లను కూడా ఫైనల్ చేసేశారు. ఇంకో రెండుమూడు రోజుల్లో షో ప్రారంభం అవుతుంది అనగా… యూట్యూబర్ అలేఖ్య హారికకు కరోనా వచ్చింది. దీంతో హారిక షో నుంచి తప్పుకుంది.
ఆ తర్వాత తాజాగా మరో ఇద్దరు కంటెస్టెంట్లు కూడా బిగ్ బాస్ నిర్వాహకులకు హ్యాండ్ ఇచ్చారు. తనుజ పుత్తస్వామి అనే కంటెస్టెంట్ కూడా చివరి నిమిషంలో షోకు హ్యాండ్ ఇచ్చింది. ముద్ద మందారం సీరియల్ లో హీరోయిన్ గా నటించింది ఈమె. తనుజకు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. అందుకే.. తనను బిగ్ బాస్ యాజమాన్యం సెలెక్ట్ చేశారు. కాని.. తనుజ చివరి నిమిషంలో షో నుంచి తప్పుకుంది.
మరోవైపు కోరియోగ్రాఫర్ రఘుమాస్టర్ కూడా షోనుంచి తప్పుకున్నారు. తనకేదో వ్యక్తిగత సమస్యలు ఉండి రఘు మాస్టర్ షో నుంచి తప్పుకున్నాడట.
దీంతో ఏం చేయాలో తెలియని బిగ్ బాస్ యాజమాన్యం.. వెంటనే వెయిటింగ్ లిస్టులో పెట్టుకున్న కంటెస్టెంట్లను ఓకే చేశారట.
ఏది ఏమైనా.. బిగ్ బాస్ సీజన్ 4కు ప్రారంభం కాకముందే ఎన్నో సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇక.. ఈ షో షూటింగ్ సెప్టెంబర్ 5న ప్రారంభం కానుండగా… షో మొదటి ఎపిసోడ్ సెప్టెంబర్ 6న ప్రారంభం కానుంది.