ప్రపంచపు అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ నాలుగో సీజన్ భారీ రెస్పాన్స్ అందుకుని దూసుకుపోతోంది. మొదటి సీజన్ తోనే తన స్టామినాను ప్రపంచానికి పరిచయం చేసిన ఈ షో తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి రేటింగ్ సాధిస్తూ మిగతా వారికి వెన్ను వణుకు పుట్టిస్తోంది. ఇక ప్రస్తుతం జరుగుతున్న నాలుగో సీజన్ లో కొన్ని విమర్శలు నిర్వాహకులపై వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో వారు చేస్తున్న మోసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి అని అంటున్నారు.
ఫలితంగా నిరసనలు ఎక్కువ అయ్యాయి. ఇక షో లో నిర్వాహకులు ఇది రియాలిటీ అని చెబుతున్నప్పటికీ డైరెక్షన్ ఆధారంగానే నడుస్తుందని ఎన్నో రోజుల నుండి అందరికీ డౌట్ ఉంది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు అయితే నమ్మశక్యంగా లేకపోవడంతో అవి కాస్త రెట్టింపు అయ్యాయి. అలాగే అత్యంత ప్రాధాన్యం కలిగిన ఓటింగ్ సిస్టం పై ఈ సీజన్లో వచ్చిన విమర్శలు ఎక్కడా రాలేదు. అందుకు కారణం ఓటింగ్ ట్యాలీ ఎక్కడా చూపించారు.
బయటికి వెళ్ళిన తర్వాత ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ బిగ్బాస్ యూనిట్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. రేటింగ్ కోసం వారికి నచ్చిన వారిని హౌస్ లో ఉంచి మిగతా వారిని నెమ్మదిగా సాగనంపడం ఏమిటి అన్నది వారి ఆరోపణ. ఇక హౌస్ లో గొడవలు జరిగితే రేటింగ్ నెంబర్వన్ స్థానంలో ఉంటుంది. ఇక వాస్తవానికి 24 గంటల్లో ఎన్నో విషయాలు జరుగుతాయి కానీ యూనిట్ మాత్రం తమకు నచ్చిన క్లిప్పింగ్ ను ప్రసారం చేస్తోంది అని… అది కాకుండా ఎవరి వల్ల అయితే రేటింగ్ ఎక్కువ వస్తుందని వారినే చూపిస్తున్నారని భావిస్తున్నారు.
వారికి అనుకూలంగా ఉన్న క్లిప్పింగులను ఎడిటింగ్ చేసి చూపిస్తున్నారని అంటున్నారు. ఇవన్నీ అన్ సీన్ ఎపిసోడ్స్ లో, ఎపిసోడ్స్ లో కంటెస్టెంట్స్ మధ్య జరుగుతున్న సంభాషనల్లో బహిర్గతం అవుతున్నాయట. ఇలా చేయడం వల్ల సూర్య కిరణ్ నుండి మహబూబ్ వరకు చాలా మంది ప్రేక్షకుల దృష్టిలో చెడు అయ్యారని ఆరోపణలు వస్తున్నాయి. మరి దీనికి బిగ్బాస్ నిర్వాహకులు సమాధానం ఆశించవచ్చా..?