బుల్లితెర చరిత్ర లో ఏ ఇతర షో కి సాధ్యంకాని హప్ ని అందుకుంటూ రికార్డు టిఆర్పి రేటింగ్ నమోదు చేసి దూసుకుపోతున్న బిగ్ బాస్ భారతదేశంలో భయంకరమైన పాపులారిటీని సంపాదించింది. అన్నీ భాషలలో దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక ముఖ్యంగా తెలుగులో సూపర్ డూపర్ హిట్ అని చెప్పాలి. విజయవంతంగా మూడు సీజన్లు పూర్తిచేసుకొని కరోనా కష్టకాలంలో కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా నాలుగో సీజన్ మొదలుపెట్టారు నిర్వాహకులు.
అయితే రసవత్తరంగా సాగుతున్న ఈ సీజన్ లో బిగ్బాస్ యూనిట్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు బయటకు వస్తున్నాయి. మొదటి నుండి కంటెస్టెంట్ ల విషయంలో గోప్యత ప్రదర్శించిన బిగ్ బాస్ యూనిట్ కరోనా ప్రభావంతో అందరికీ పరీక్షలు చేయించి క్వారంటైన్ లో ఉంచారు. అది పూర్తయిన తర్వాతే లోనికి పంపించారు. ఇక ఇలాంటి సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్న బిగ్ బాస్ యూనిట్ బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్ లో కంటెస్టెంట్ల ఇంటి సభ్యులు కొంతమంది ఎంటర్ కాబోతున్నారు అని అందరికీ తెలుసు.
కాబట్టి అందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు. అఖిల్, హారిక, అవినాష్, అభిజిత్ వాళ్ళ మదర్స్ ఇంటి లోనికి వచ్చినట్లు తెలుస్తుంది. అలాగే గురువారం మరికొందరు లోనికి ప్రవేశించే అవకాశం ఉంది. కరోనా ప్రభావం ఉన్నప్పుడు బయట వాళ్ళను ఇంట్లోకి ఎందుకు రానిస్తున్నారు అన్న సందేహం అందరిలో నెలకొంది. అయితే ఇంట్లోకి వచ్చే వారంతా గ్లాస్ ఫ్రేమ్ కు అటువైపే ఉండాలని,,,, బోర్డర్ దాటి లోనికి రాకూడదని బిగ్బాస్ ఆదేశించాడట. దానికి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసినట్లు తెలుస్తోంది