బిగ్బాస్ అంటేనే గొడవలు, కొట్లాటలు, అరుచువడంతో తరచూ జరుగుతుంటాయి. ఏదో ఒక సంఘటన ఇంట్లో హాట్ టాపిక్ కావడం మామూలే. ఇక షో కి ఎక్కువ రేటింగ్ వస్తుందన్న కారణంతో నిర్వాహకులు కూడా వాటిని ఎక్కువగా హైలైట్ చేస్తూ ఉంటారు. ప్రతి సీజన్ లో జరిగేది ఇదే. ఇలాంటి పరిస్థితుల్లో ఒక టాప్ కంటెస్టెంట్ ను బ్యాడ్ చేసేందుకు బిగ్బాస్ కుట్ర చేసినట్లు ఒక న్యూస్ లీక్ అయింది.
వివరాల్లోకి వెళితే బిగ్ బాస్ షో రియాలిటీ ఆధారంగా నడుస్తుంది అని అందరికీ తెలుసు. అయితే కొన్ని పరిణామాల కారణంగా ఈ షో పైన రోజురోజుకు సందేహాలు పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎవరో ముందే చెప్పే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే వెళ్లిపోయేందుకు కొద్దిరోజుల ముందే ఆ కంటెస్టెంట్ ను నిర్వాహకులు హైలైట్ చేస్తున్నారు. ఇక ఎంత చెడ్డ గేమ్ ఆడుతున్నప్పటికీ ప్రేక్షకుల దగ్గర నుండి తోటి సభ్యుల దగ్గర నుండి వ్యతిరేకత వస్తున్నప్పటికీ కొంతమంది కంటెస్టెంట్ లను కొనసాగిస్తున్నారు అన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రైవేట్ సైట్స్ తక్కువ ఓటింగ్ చూపించిన వారు కూడా ముందే సేఫ్ అయిపోయేలా గా ప్లాన్ చేస్తున్నారు. ఇదంతా కేవలం రేటింగ్ ను దృష్టిలో ఉంచుకొని చేస్తున్నారు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక నామినేషన్ ప్రక్రియ లో సోహెల్ హారిక ఇద్దరూ బాగా గొడవ పడ్డారు. సోహెల్ సహనం కోల్పోయి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అంతేకాకుండా అమ్మాయిని బాడీ షేవింగ్ కామెంట్లు చేశాడని అతనిపై విమర్శలు వెల్లువెత్తాయి.
కానీ అది బాగా చూపించిన బిగ్ బాస్ హారిక తో గొడవ జరిగిన తర్వాత రోజు సోహెల్ సారీ చెప్పిన విషయాన్ని మాత్రం చూపించలేదు. అప్పటినుండి వారిద్దరూ క్లోజ్ అయ్యారు కానీ అది కూడా చూపించలేదు. అఖిల్ కి సోహెల్ ఈ విషయాలను చెప్పడం తో అది బయటికి వచ్చింది. దీంతో సోహెల్ ను కావాలని టార్గెట్ చేస్తున్నారని నిర్వాహకులపై ఆరోపణలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు తల్లిదండ్రులు రాకతో ఇంటిలో హారిక-సోహెల్ క్లోజ్ అయిపోవడం విశేషం.