బిగ్బాస్ ఇంటి లోకి హాట్ ఫేవరేట్ గా ఎంటర్ అయిన న్యూస్ రీడర్ దేవి నాగవల్లి మధ్యలో అనుకోని పరిస్థితుల్లో ఎలిమినేట్ కావలసి వచ్చింది. ఆమె ఎలిమినేషన్ పై అందరికీ ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే బిగ్ బాస్ షో ద్వారా ఆమె అందుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియా లో ఆమెకి ఉన్న ఫాలోయింగ్ చూస్తేనే అర్థం అవుతుంది. ఈ మధ్య దేవీ కూడా ఆమె సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటున్నారు.
ఇక ఇటీవల కొంచెం వినూత్నంగా ఒక పోస్ట్ కూడా చేశారు. బిగ్బాస్ సీజన్ లో టెలివిజన్ జనాలకు ఎక్కువగా తెలిసిన కంటెస్టెంట్ కూడా దేవి నాగవల్లి అనే చెప్పాలి. దేవి నాగవల్లి ఇంస్టాగ్రామ్ అకౌంట్ ను లక్షల మంది ఫాలో అవుతున్నారు. తాజాగా ఆమె ఒక స్టైలిష్ ఫోటో పోస్ట్ చేసింది. నా పొలంలో కూడా మొలకలు వచ్చాయి అంటూ లక్ష్య మొలకలు వచ్చాయి అని నమస్కారం పెట్టి కామెంట్ చేసింది.
అయితే ఈ ఫోటో ఎలా వైరల్ అయిందో దాని కింద వచ్చిన వివిధ కామెంట్స్ కు కూడా దేవి సమాధానాలు అదే రేంజి లో ఇచ్చింది. పాజిటివ్ గా స్పందించిన వారికి కృతజ్ఞతలు చెప్పిన ఆమె దీని వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అని ఆమెను అడిగినవారికి డిఫరెంట్ గా కౌంటర్ ఇచ్చింది.
“ఉపయోగం ఉపయోగించడానికి ఉపయోగపడదు కానీ అలవాటు పడాలంటే దాన్ని వాడటం ఉపయోగకరంగా ఉంటుంది… జై బాలయ్య!” అంటూ తనకు తానే ఆమె వేసిన పంచ్ డైలాగ్ కాపీరైట్స్ కూడా ఇచ్చేసింది. అలా డైలాగ్ కొట్టిన దేవి నాగవల్లి జై బాలయ్య అనే పదాన్ని బాగా ఫేమస్ అయిపోయింది.