గత రెండు ఎపిసోడ్ ల నుండి బిగ్ బాస్ షో చాలా ఎమోషనల్ గా సాగుతోంది. దాదాపు 70 రోజులకు ఇంటికి దూరమైన బిడ్డలను పలకరించేందుకు ఇంట్లోకి తల్లిదండ్రులు వస్తున్నారు. 73వ రోజు ఇంటిలోకి అఖిల్ తల్లి దుర్గ, హారిక తల్లి, అభిజిత్ తల్లి, అవినాష్ లక్ష్మి మల్లమ్మ ఇంటిలోకి వచ్చి మురిపించారు.
74 వ రోజు సోహెల్, లాస్య, అరియానా పేరెంట్స్ ఇంట్లోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా వారిలో ఒక్కసారిగా భావోద్వేగాలు ఉప్పొంగాయి. బిగ్బాస్ ఈసారి వినూత్నంగా సోహైల్ తండ్రి వచ్చినప్పుడు సోహెల్ ను మినహాయించి మిగతా వాళ్లందరినీ రిలీజ్ చేశాడు. సోహెల్ మాత్రం ఫ్రీజ్ మోడ్ లో ఉండిపోయాడు. ఆ తర్వాత కొద్ది సేపటికి సోహెల్ ను కూడా అన్ ఫ్రీజ్ చేశాడు.
తన తండ్రితో మాట్లాడుతున్నంత సేపు సోహెల్ భావోద్వేగంతో కదిలిపోయాడు. ఈ సీజన్ తర్వాత జనం అందరూ బయట కథ వేరే లాగా ఉంటుంది అనే డైలాగ్ ను చెబుతున్నారని చిన్న పిల్లలు కూడా డైలాగ్ ఉపయోగిస్తున్నారు అని చెప్పగానే అందరూ హ్యాపీ ఫీలయ్యారు.
ఇక యాంకర్ లాస్య కొడుకు జున్ను ఇంట్లో కి రావడంతో ఎమోషనల్ అయిపోయారు. లాస్య వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి కొడుకు తో మాట్లాడింది. లాస్య భర్త మంజునాథ్ ఇంటి సభ్యులు మాట్లాడుతున్నప్పుడు ఏంటి ఏంటి అని అఖిల్ కామెంట్ చేయగా… ఆంటీ అంటే బాగోదు అంటూ మంజునాథ్ సరదాగా వార్నింగ్ ఇచ్చాడు. ఇక ఇంట్లోకి వచ్చిన జున్ను ని అవినాష్ జోకర్ లాగా మారి నవ్వించాడు.