దాదాపు ముప్పై ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందిన అక్కినేని నాగార్జున తన సినీ కెరీర్లో ఎన్నో మైలురాళ్లను అందుకున్నాడు, ఆరు పదుల వయసులో కూడా పాతికేళ్ళ కుర్రాడి లా ఫిట్ గా చేస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు. కొన్నేళ్లక్రితం మీలో ఎవరు కోటీశ్వరుడు షో తో బుల్లితెర హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన బిగ్ బాస్ షో లో 2 సీజన్లను సక్సెస్ ఫుల్ గా నడిపిస్తూ తన సత్తా చాటుతున్నాడు.
అలాగే క్లిష్టపరిస్థితుల్లో నాగార్జున కంటెస్టెంట్లతో మసులుకునే విధానం కూడా అందరికీ నచ్చుతుంది. కానీ ఈ మధ్య అతను ఇద్దరు కంటెంట్లతో వ్యవహరించిన తీరు మాత్రం వివాదాస్పదం అయ్యింది. ఇక తాజాగా నాగార్జున స్టేజి పైన వ్యవహరించిన తీరు ఎంతో వివాదాస్పదం అయింది. స్టార్ హీరో అయినప్పటికీ నాగార్జున అందరితో బాగా సరదాగా ఉంటారు. బిగ్ బాస్ షోలో స్టేజి పైన కూడా అదే ప్రవర్తనను కొనసాగిస్తూ ఉంటాడు.
శనివారం జరిగిన ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయిన నోయల్ తో నాగార్జున దూరంగా జరిగి మాట్లాడాడు. ఆయన చేసిన ఈ పని చాలా వివాదాస్పదమయ్యింది. “ఎక్కడెక్కడో తిరిగి వచ్చాను కదా…. దూరం పాటిద్దాం” అని నాగార్జున నోయల్ తో చెప్పాడు. అయితే అంతకు ముందు వారం ఎలిమినేట్ అయిన దివి తో మాత్రం నాగార్జున క్లోజ్ గా ఉండి ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. దివి తో అతను కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతున్నాయి.
వాటి పక్కనే నాగ్ నోయల్ ని దూరం పెట్టిన విధానాన్ని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇక దీనికి నాగార్జున పై వచ్చిన నెగటివ్ ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. దీనిని నాగార్జున రాబోయే ఎపిసోడ్ లలో సరిదిద్దుకుంటాడా లేదా అన్నది చూడాలి.
https://www.instagram.com/p/CHCLSvtM03T/?utm_source=ig_embed