బిగ్బాస్ ఇంటిలో పరిస్థితులు చాలా హాట్ గా తయారయ్యాయి. ఈ సమయంలో కంటెస్టెంట్ అభిమానులు సోషల్ మీడియాలో మాటల దాడికి దిగుతారు. దీనిని సోషల్ మీడియా భాషలో సైబర్ దాడి అని అంటారు. ఇక ఈ సమయంలో ఇది పిక్స్ లో ఉంటుంది.ఏదో ఒక కంటెస్టెంట్ అభిమానులు అయితే మిగతా వారిపై మాటల దాడికి దిగి వారి కుటుంబాలను కూడా వదలరు తీవ్రమైన చర్చ చేస్తారు.
ఈ దాడికి చాలామంది డిప్రెషన్ లోకి వెళ్లిన విషయం తెలిసిందే తాజాగా మోనాల్, ఆమె సోదరి హేమాలి పై జరిగిన ట్రోలింగ్ గురించి బిగ్ బాస్ మాజీ కంట్స్తేంట్ వితిక షేరు ప్రస్తావిస్తూ ఒక సుదీర్ఘమైన వీడియో ని చేసింది. ఇంట్లోకి వచ్చిన హెమాలి బాగా ఫేమస్ అయింది. అయితే ఆమె వేసిన ఒక్క డైలాగ్ రెండు రాష్ట్రాల్లో బాగా ట్రెండింగ్ అయ్యాయి. ఏదైనా ఉంటే ముందు మాట్లాడు మా అక్క గురించి ఎనకాల మాట్లాడకు అని అభిజిత్ తో హీమాలి యాటిట్యూడ్ చూపించింది.
ఇక ఆమె వార్నింగ్ ఇచ్చినట్లు తో మాట్లాడటం తో అతని ఫ్యాన్స్ హేమాలి ను ఒక రేంజ్ లో ఆడుకున్నారు. ఇక ఇంటి నుండి బయటకు వచ్చిన మోనాల్ ఇంటర్వ్యూ ఇస్తూ ఈ చేదు అనుభవం గురించి బయటకు చెప్పింది. అయితే ఆమె ఒక్కో చోట ఒక్కోలా చెప్పింది. ఒకచోట అభిజిత్ ఫ్యాన్స్ అంటుంది మరొకచోట అభిజిత్ పీఆర్ టీం అంటోంది.
అలాగే తన సోదరి ని చంపుతామని బెదిరింపు కాల్స్ రావడమే కాకుండా ఫ్యామిలీని కూడా దారుణంగా తిట్టారు అని…. ఇలా వారిపై జరిగిన దాడి పై సైబర్ కేసులు పెట్టారని చెప్పుకొచ్చింది. ఇక ఇదంతా చూసి బయటకు వచ్చిన మోనాల్ కావాలని ఏదో మోటివ్ తో ఇలా చేస్తోందని కామెంట్స్ చేస్తున్నారు.