బిగ్ బాస్ నాలుగవ సీజన్ ముగిసిన తర్వాత సెలబ్రిటీలందరూ యూట్యూబ్, ఇంస్టాగ్రామ్ లో కి వచ్చి లైవ్ చాట్ లో ప్రేక్షకులతో కలిశారు ఈ సందర్భంగా మోనాల్ గజ్జర్ తన అభిమానులతో ముచ్చటించింది. అలాగే అభిజిత్, అఖిల్, సోహెల్, మెహబూబ్ గొడవలు వివాదాల గురించి కూడా మాట్లాడింది. తను ఇంటికి వెళ్ళడానికి ముందు తెలుగు నేర్చుకుని ఉండాల్సింది అని చాలా బాధపడింది. అంతే కాకుండా అసలు మొదటి ఐదు ఆరు వారాలు తెలుగు అర్థం చేసుకోలేకపోయాను అని చెప్పింది.
ఇక నాలుగవ సీజన్ ట్రోఫీని గెలిచిన అభిజిత్ తో మాట్లాడినట్టు అతనికి కంగ్రాట్స్ చెప్పినట్లు తెలిపింది. తనతో కూడా పాజిటివ్ గా స్పందించాడు అని అభిమాని అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. అఖిల్ ను అవినాష్ పులిహోర అనడంపై ఆమె స్పందిస్తూ… ఇంటిలో ఒకరిని ఒకరు ఆట పట్టించుకోవడం చాలాంకామ అని దానిని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పింది. పైగా ఇంట్లో ఎవరూ పులిహోర వాళ్ళు లేరు అని కూడా చెప్పింది.
అయితే ఫైనల్స్ సందర్భంలో సోహెల్ కు మెహబూబ్ వచ్చి డబ్బులు తీసుకోమని హింట్ ఇచ్చిన వీడియో విపరీతంగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దీనిపై స్పందిస్తూ నేను కూడా వీడియో ని చూశాను. కానీ అతను ఏం చెప్పాడో నాకు అర్థం కాలేదు… అయితే ఏదో చెప్పడం గమనించాను అని చెప్పింది. అది ఆ సమయంలో ఇంట్లో ఉన్న వారు చెప్పాల్సిన విషయం… ఏం జరిగిందో వారికే బాగా తెలుస్తుంది అని అనింది.